తుంగతుర్తి, ఆగస్టు 03 : అర్హులైన ప్రతి ఒక్కరికి నూతన పెన్షన్లు వెంటనే ఇవ్వాలని తుంగతుర్తి మండల మాజీ ఎంపీపీ తాటికొండ సీతయ్య రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సోమవారం తుంగతుర్తి మండల కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ కార్యలయంలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఆగస్టు 15 నుండి వితంతువులు, ఒంటరి మహిళలు, వికలాంగుల కుటుంబ సభ్యులకు పెన్షన్లు ఇస్తామని చెబుతుందే తప్పా అధికారులకు ఇంతవరకు ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేదన్నారు. అదేవిధంగా గోదావరి నీళ్లు సముద్రం పాలవుతున్న రేవంత్ రెడ్డి సర్కార్ నిమ్మకు నీరేత్తే విధంగా చూస్తుందని ఆరోపించారు. ఎస్సారెస్పీ కాలువల ద్వారా కాల్వలకు రైతుల పొలాలకు సాగునీరు అందించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా నాయకులు గుండగాని రాములు గౌడ్, మండల నాయకులు దొంగరి శ్రీనివాస్, సర్పంచులు మేడదుల రమేష్, మాత్తంగి వెంకటమ్మ కరుణాకర్, నాయకులు నల్లబెల్లి వెంకటేష్, బొజ్జ సాయికిరణ్, బల్లెం ప్రవీణ్, గోపగాని వెంకన్న వెంకటేష్ పాల్గొన్నారు.