కరీంగంజ్ : (Bridge collapse) అసోంలో వేలాడే వంతెన ఒకటి కుప్పకూలిపోయింది. ఈ ఘటనలో 30 మంది విద్యార్థులకు గాయాలయ్యాయి. విద్యార్థులు పాఠశాల నుంచి ఇంటికి తిరిగి వస్తుండగా ఈ సంఘటన జరిగింది. ఈ సంఘటన సోమవారం కరీంగంజ్ జిల్లాలోని రతబరి అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని చెరగి ప్రాంతంలో జరిగింది. అందిన సమాచారం మేరకు, సింగ్లా నదిపై వేలాడే వంతెన చెరగి ప్రాంతాన్ని గ్రామంతో కలుపుతుంది. విద్యార్థులు, స్థానికులు అనేక సంవత్సరాలుగా ఈ వంతెనను ఉపయోగిస్తున్నారు.
సోమవారం సాయంత్రం చెరగి విద్యాపీఠ్ ఉన్నత పాఠశాల విద్యార్థులు సింగ్లా నదిని దాటేందుకు ప్రయత్నిస్తుండగా, వేలాడే వంతెన అకస్మాత్తుగా కూలిపోయింది. వంతెనపై నడుస్తున్న విద్యార్థులు నదిలో పడిపోయారు. దాదాపు 30 మంది విద్యార్థులకు గాయాలయ్యాయి. స్థానికులు సంఘటనా స్థలానికి చేరుకుని నదిలో పడిపోయిన విద్యార్థులను రక్షించారు. వేలాడే వంతెన మూడేండ్ల క్రితం నిర్మించినట్లు గ్రామస్తులు చెప్పారు.
అణు రియాక్టర్ల నిర్మాణ ప్రణాళికలు ప్రస్తుతానికి లేవు : జపాన్
చార్ధామ్ భక్తుల సంఖ్య పరిమితి ఎత్తివేసిన హైకోర్ట్
13 మంది హజారాలను చంపిన తాలిబాన్ : హక్కుల సంఘం ఆరోపణ
షూటింగ్లో ఐశ్వరీ ప్రతాప్ సింగ్ తోమర్కు ‘గోల్డ్’
వీరనారి రాణి దుర్గావతి జయంతి నేడు
గుండె ఆరోగ్యాన్ని కంటితో తెలుసుకోవచ్చు.. అమెరికా పరిశోధన
నీటిలో ఒలికిన నూనెను వేరుచేసే హైడ్రోఫోబిక్ కాటన్.. ఐఐటీ గువాహటి పరిశోధకుల కృషి
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..