ఈనెల మూడో వారంలో వెస్టిండీస్ తో వన్డేలు ఆడేందుకు గాను కరేబియన్ దీవులకు వెళ్లనున్నది టీమిండియా. అక్కడ వెస్టిండీస్ తో మూడు వన్డేలు, ఐదు టీ20లు ఆడుతుంది. అయితే వన్డే సిరీస్ కు రోహిత్ కు విశ్రాంతినిచ్చి.. శిఖర్ ధావన్ ను సారథిగా నియమించింది భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ). ఇప్పుడు ఈ నిర్ణయంపై సోషల్ మీడియాలో నెటిజన్లు బీసీసీఐపై ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. అసలు ఏమంత క్రికెట్ ఆడాడని రోహిత్ కు రెస్ట్ ఇచ్చారని ప్రశ్నిస్తున్నారు.
గతేడాది విరాట్ కోహ్లి నుంచి కెప్టెన్సీ పగ్గాలు అందుకున్న రోహిత్ శర్మ.. ఐపీఎల్ కు ముందు రెండు సిరీస్ (వెస్టిండీస్, శ్రీలంక) లు మినహా తీరిక లేని క్రికెట్ ఆడింది లేదు. అయినా ఐపీఎల్ తర్వాత స్వదేశంలో దక్షిణాఫ్రికాతో జరిగిన ఐదు మ్యాచుల టీ20 సిరీస్ కు అతడికి విశ్రాంతినిచ్చారు. ఆ తర్వాత అతడు ఇంగ్లండ్ కు పయనమయ్యాడు. కానీ మంగళవారం ఇంగ్లండ్ తో ముగిసిన రీషెడ్యూల్డ్ టెస్టులో కరోనా కారణంగా దూరమయ్యాడు.
ఐపీఎల్ ముగిసిన నెలన్నర విరామం తర్వాత అతడు జులై 7 నుంచి ఇంగ్లండ్ తో ప్రారంభం కాబోయే టీ20 సిరీస్ ఆడనున్నాడు. ఈ సిరీస్ లో అతడు ఇంగ్లండ్ తో 3 టీ20లు, 3 వన్డేలు మాత్రమే ఆడతాడు. దానికే అలిసిపోతాడా..? అని నెటిజన్లు ట్విటర్ వేదికగా బీసీసీఐని ప్రశ్నిస్తున్నారు.
ఇదే విషయమై పలువురు నెటిజన్లు స్పందిస్తూ.. ‘రోహిత్ శర్మ అంతగా అలసిపోవడానికి కారణాలేంటి..? ఎందుకు అతడికి వరుసగా రెస్ట్ ఇస్తున్నారు..?’, ‘అసలు కోహ్లి, రోహిత్ లకు విశ్రాంతి ఎందుకిస్తున్నారో నాకైతే అర్థం కావడం లేదు. ఇంకెంత రెస్ట్ కావాలి వాళ్లకు..? వాళ్లిద్దరి కెరీర్ లు ముగిసే దశలో ఉన్నాయి. ఈ సమయంలో వారితో ఎక్కువ క్రికెట్ ఆడించాలి గానీ ఇలా వరుసగా రెస్ట్ ఇస్తే ఎలా..?’, ‘రోహిత్ కెరీర్ ను బీసీసీఐ విజయవంతంగా నాశనం చేస్తున్నది..’ అని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
What has made @ImRo45 very tired, to take rests at this frequency??? #RohitSharma https://t.co/cbdSoL3WuN
— Shahul Hameed (@shahul0701) July 6, 2022
I don't understand the point of resting those players…how much rest u need yaar…u haven't played SA series and u miss lot of small series…Kohli and Rohit are at the flag end of their careers..u should play games man… totally disappointed #bcci #Kohli #RohitSharma
— Bhargav (@Bhargav78264) July 6, 2022
Resting all main players and expecting them to perform for the upcoming major tournaments. #BCCI is pushing Indian team to another group stage exit.
Only 3 months for the T20 WC. Enough of this new fancy shit.#TeamIndia #ViratKohli#BCCI #RohitSharma #WIvsIND
— vaisakh satheesh (@vaisakh_____s) July 6, 2022