కాసిపేట, డిసెంబర్ 14 : మంచిర్యాల జిల్లా కాసిపేట మండలంలోని మల్కెపల్లి (Malkepalli) గ్రామ పంచాయతీలో ఆదివారం జరుగుతున్న సర్పంచ్, వార్డు సభ్యుల ఎన్నికల కౌంటింగ్ నిలిపివేయాలని హైకోర్టు (High Court) ఆదేశాలు జారీ చేసింది. పోలింగ్ ఎధావిధిగా జరగనుండగా కౌంటింగ్ మాత్రం నిలిపి వేయాలని ఆదేశాలు జారీ చేసింది. మల్కెపల్లి షెడ్యూల్ ఏరియాపై పలువురు గ్రామస్తులు హై కోర్టును ఆశ్రయించగా వాదనలు కొనసాగుతూ వచ్చాయి. రెవెన్యూ రికార్డు విరుద్ధంగా నాన్ షెడ్యూల్ ఏరియాగా ఉన్న మల్కెపల్లి గ్రామాన్ని అధికారులు షెడ్యూల్ ఏరియాగా కొనసాగిండం అన్యాయమని, దీనిపై చర్యలు తీసుకొని మల్కెపల్లి గ్రామ పంచాయతీని నాన్ షెడ్యూల్ ఏరియాగా ప్రకటించాలని కోరుతూ గ్రామానికి చెందిన కసాడి శ్రీనివాస్, పలువురు గ్రామస్తులు హై కోర్టును ఆశ్రయించారు.
ఈ మేరకు నాన్ షెడ్యూల్ ఏరియా ఉన్నటువంటి అన్ని ఆధారాలు సమర్పించినట్లు తెలిపారు. ఇదిలా ఉండగా అధికారుల నుంచి ఎటువంటి సమాధానం రాకపోవడంతో అన్ని ఆధారాలను సమర్పించారు. దింతో ఎన్నికలు జరగనుండగా కౌంటింగ్ మాత్రం ఫైనల్ తీర్పు అనంతరమే కౌంటింగ్ చేయనున్నట్లు అధికారులు తెలిపారు. నాన్ షెడ్యూల్ ఏరియాపై తుది తీర్పు వచ్చే వరకు ఎన్నికల ఫలితాలు బ్రేక్ పడింది. దింతో మల్కెపల్లిలో ఉత్కంఠ నెలకొంది.