WTC 2023-25 : సొంతగడ్డపై ఉప్పల్ స్టేడియంలో తొలి టెస్టు ఓటమి బాధలో ఉన్న భారత జట్టు(Team India) పెద్ద షాక్ తగిలింది. ప్రపంచ టెస్టు చాంపియన్సిప్(WTC 2023-25) పాయింట్ల పట్టికలో ఐదో స్థానానికి పడిపోయింది. గత ఐదు టెస్టుల్లో రెండింటిలో మాత్రమే గెలిచిన రోహిత్ సేన 43.33 విజయాల శాతంతో బంగ్లాదేశ్ కంటే వెనకబడిపోయింది.
స్వదేశంలో పాకిస్థాన్ను వైట్వాష్ చేసి.. వెస్టిండీస్తో టెస్టు సిరీస్ సమం చేసుకున్న ఆస్ట్రేలియా టాప్ ర్యాంక్లో ఉంది. దక్షిణాఫ్రికా 50 శాతంతో రెండో స్థానంలో, న్యూజిలాండ్ జట్టు 50 శాతంతో మూడో స్థానంలో నిలిచాయి. కివీస్ గడ్డపై చారిత్రాత్మక విజయం సాధించిన బంగ్లాదేశ్ నాలుగో ప్లేస్ దక్కించుకుంది.
Australia remain on top of the #WTC25 table despite defeat at the Gabba, West Indies climb up to seventh 📈
India slide from second to fifth after England’s superb win in Hyderabad 📉#AUSvWI #INDvENG pic.twitter.com/LqefJ8DKIk
— ESPNcricinfo (@ESPNcricinfo) January 28, 2024
ప్రపంచ టెస్టు చాంపియన్సిప్లో తిరుగులేని రికార్డు ఉన్న భారత్.. కొత్త ఏడాదిలో దక్షిణాఫ్రికాపై చిరస్మరణీయ విజయం సాధించి డబ్ల్యూటీసీ పట్టికలో రెండో స్థానంలో నిలిచింది. కానీ సొంతగడ్డపై మాత్రం తేలిపోయింది. ఐదు టెస్టుల సిరీస్లో భాగంగా ఉప్పల్ స్టేడియంలో ఇంగ్లండ్ జరిగిన తొలి టెస్టులో అనూహ్యంగా ఓడిపోయింది.
England overturn a first-innings deficit of 190 runs for one of the great victories in India!https://t.co/WzuwYpQ2Rp | #INDvENG pic.twitter.com/PbdbmbraHe
— ESPNcricinfo (@ESPNcricinfo) January 28, 2024
బజ్ బాల్ ఆటతో చెలరేగిన బెన్ స్టోక్స్ సేనకు బదులివ్వలేక 28 పరుగుల తేడాతో మ్యాచ్ చేజార్చుకుంది. దాంతో, డబ్ల్యూటీసీ పట్టికలో ఐదో స్థానంతో సరిపెట్టుకుంది. అయితే.. మిగతా నాలుగు టెస్టుల్లో గెలిస్తే టీమిండియా టాప్లోకి దూసుకెళ్లే చాన్స్ ఉంది. అదే జరిగితే ముచ్చటగా మూడోసారి భారత్ ప్రపంచ టెస్టు చాంపియన్సిప్ ఫైనల్కు దూసుకెళ్తుంది.