అమరావతి : ఆంధ్రప్రదేశ్ డీజీపీగా(AP DGP) హరీశ్ గుప్తా(Harish Gupta) సోమవారం బాధ్యతలు స్వీకరించారు. కాగా, డీజీపీ రాజేంద్రనాథ్రెడ్డిపై కేంద్ర ఎన్నికల సంఘం బదిలీ ఆదివారం వేటువేసిన విషయం తెలిసిందే. తక్షణమే ఆయనను బదిలీ చేయాలని సీఎస్కు ఆదేశాలు జారీచేసింది. సోమవారం ఉదయం11 గంటల్లోగా ముగ్గురు డీజీ ర్యాంకు అధికారుల జాబితా పంపాలని ఆదేశించింది.
ఈసీ(Election Commission) సూచన మేరకు కొత్త డీజీపీని నియమించేందుకు ముగ్గురి పేర్లతో కూడిన ప్యానెల్ను ఏపీ సర్కారు పంపింది. సీనియారిటీ జాబితాలో ఉన్న ఐపీఎస్ అధికారులు ద్వారకా ఆర్టీసీ ఎండీ తిరుమలరావుతో పాటు మాదిరెడ్డి ప్రతాప్, హరీశ్కుమార్ గుప్తా పేర్లను సిఫారసు చేసింది. ఈందులో హరీశ్ గుప్తాను డీజీపీగా ఈసీ ఎంపిక చేసింది.