Preity Zinta : ఐపీఎల్లో టోర్నీల్లో ‘పంజాబ్ కింగ్స్’ జట్టులో ఎంఎస్ ధోనీని చూడాలని ఉందంటూ ఓ అభిమాని ప్రీతీ జింతాకు ట్వీట్ చేశాడు. పంజాబ్ కింగ్స్ టీమ్ సహ యజమాని అయిన ప్రీతీ జింతా ఆ అభిమాని అభ్యర్థనకు ఆసక్తికరమైన సమాధానం ఇచ్చారు. ధోనీని ఎవరు కాదంటారని, ప్రతి ఒక్కరూ కోరుకుంటారని, నాతో సహా ప్రతి ఒక్కరూ ఆయనకు అభిమానులేనని వ్యాఖ్యానించారు.
తన అధికారిక ఎక్స్ ఖాతాలో ప్రీతీ జింతా ఇచ్చిన ఈ రిప్లై నెటిజన్ల మనసు దోచుకుంది. తన రిప్లైలో ఆదివారం పంజాబ్, చెన్నై జట్ల మధ్య జరిగిన మ్యాచ్ గురించి కూడా జింతా తన అభిప్రాయాన్ని పంచుకున్నారు. నిన్నటి మ్యాచ్లో పంజాబ్ జట్టు గెలువాలని, ధోనీ సిక్సర్లు కొట్టాలని తాను కోరుకున్నానని.. కానీ దురదృష్టవశాత్తు మా టీమ్ గెలువలేదని, ధోనీ సిక్స్లు కొట్టకుండానే ఔటయ్యాడని ప్రీతి జింతా పేర్కొన్నారు.
ఓమేశ్ అనే ఓ అభిమాని ఓమేశ్ క్రికెట్హాలిక్ అనే తన ఎక్స్ హ్యాండిల్ ద్వారా ప్రీతి జింతాకు సోమవారం మధ్యాహ్నం ఒక అభ్యర్థన చేశాడు. ‘మేడమ్ మేం ఎంఎస్ ధోనీని పంజాబ్ కింగ్స్ జట్టులో చూడాలని అనుకుంటున్నాం’ అంటూ ఓ ఎమోజీని.. ఎరుపు, పసుపు లవ్ సింబల్స్ను జతచేశారు. ప్లీజ్ చాట్ అని అభ్యర్థించాడు. దానికి ప్రీతీ జింతా పైవిధంగా స్పందించారు.