WTC : కొత్త ఏడాది మొదలైన నాలుగు రోజుల్లోనే భారత జట్టు(Tem India) అదిరిపోయే బోణీ కొట్టింది. వరల్డ్ నంబర్ 1గా దక్షిణాఫ్రికాపై గడ్డపై అడుగుపెట్టిన రోహిత్ సేన కీలకమైన కేప్టౌన్(Kape Town)లో చిరస్మరణీయ విజయం సాధించింది. రెండు టెస్టుల సిరీస్ను సమం చేయడమే కాకుండా 12 కీలక పాయింట్లు సాధించింది. దాంతో, ప్రపంచ టెస్టు చాంపియన్షిప్-25(WTC 2023-25) పట్టికలో మళ్లీ అగ్రస్థానానికి చేరుకుంది.
ప్రస్తుతం భారత్ 54.16 విజయాల శాతంతో టాప్లో ఉండగా.. 50 శాతంతో దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్ వరుసగా రెండు, మూడు స్థానాల్లో నిలిచాయి. నిరుడు టెస్టు గదను తన్నుకుపోయిన ఆస్ట్రేలియా నాలుగో స్థానం దక్కించుకోగా.. న్యూజిలాండ్పై తొలి టెస్టు విజయంతో చరిత్ర సృష్టించిన బంగ్లాదేశ్ ఐదో స్థానంలో ఉంది.
India’s first Test win in Cape Town takes them to the top of the #WTC25 table 🇮🇳 #SAvIND pic.twitter.com/0PwBlNJlih
— ESPNcricinfo (@ESPNcricinfo) January 4, 2024
నిరుడు డబ్ల్యూటీసీ ఫైనల్లో ఓటమి అనంతరం భారత జట్టు.. వెస్టింటిండీస్ పర్యటనలో టెస్టు సిరీస్ సమం చేసింది. దాంతో డబ్ల్యూటీసీ 2023-25 సైకిల్లో పాకిస్థాన్తో కలిసి సంయుక్తంగా అగ్రస్థానంలో నిలిచింది. 2024 ఆరంభంలోనే సఫారీలపై సంచలన విజయంతో భారత్ మళ్లీ నంబర్ 1 ర్యాంక్ కైవసం చేసుకుంది. ఐసీసీ 2021లో తొలిసారి ప్రవేశ పెట్టిన ప్రపంచ టెస్టు చాంపియన్షిప్లో భారత జట్టు ఫైనల్ చేరింది.
టెస్టు గదతో ఆస్ట్రేలియా జట్టు, నిర్వేదంలో రోహిత్ శర్మ
కానీ, న్యూజిలాండ్ ఆల్రౌండర్ కైలీ జేమీసన్(Kyle Jameison) విజృంభణతో అనూహ్యంగా ఓటమి పాలైంది. నిరుడు కూడా సంచలన ప్రదర్శనతో టైటిల్ పోరుకు అర్హత సాధించిన టీమిండియా ఓవల్(Oval) స్టేడియంలో ప్యాట్ కమిన్స్ సేన చేతిలో కంగుతిన్నది. రెండు సార్లు చేతి దాకా వచ్చి అందకుండా పోయిన టెస్టు గదను ఈసారి దక్కించుకోవాలని భార జట్టు కసితో ఉంది.