హైదరాబాద్ : నిత్యం విధి నిర్వహణలో కష్టించే ప్రభుత్వ ఉద్యోగులకు క్రీడలు మానసిక ఉల్లాసాన్నిస్తాయని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్(Minister Ponnam Prabhakar) పేర్కొన్నారు. గురువారం టీఎన్జీవో హైదరాబాద్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన 9వ స్పోర్ట్స్మీట్( Sportsmeet ) ను మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ(Telangana) రాష్ట్ర సాధనలో టీఎన్జీవో(TNGO) సంఘం పాత్ర మరువలేనిదని అన్నారు.
ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ఏర్పాటయిన టీఎన్జీవో సంఘం 77 వసంతాలు పూర్తి చేసుకోవడం శుభపరిణామమని అన్నారు. నిత్యం ప్రతి ఉద్యోగి (Employee) వ్యాయామం (Exercise) చేయడంతో పాటు క్రీడలలో (Sports) పాల్గొనడం శారీరకదారుఢ్యాన్ని పెంచుతుందని వివరించారు.
హైదరాబాద్ జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి, జిల్లా శాఖ అధ్యక్షుడు ముజీబ్హుస్సేనీ మాట్లాడుతూ జిల్లా శాఖ ఆధ్వర్యంలో నిర్వహించే 9వ నాకౌట్ మ్యాచ్లకు ఈ యేడాది యెట్టం సదానంద్ నాకౌట్ క్రికెట్ టోర్నమెంట్ పేరిట నిర్వహిస్తున్నామని అన్నారు.ఈ నెల 10,11వ తేదీలల్లో లాల్ బహదూర్ స్టేడియంలో సెమి ఫైనల్,ఫైనల్ మ్యాచ్లను నిర్వహిస్తున్నామని వెల్లడించారు. అనంతరం మంత్రి పొన్నం ప్రభాకర్, కలెక్టర్ అనుదీప్ క్రికెట్ ఆడి ఉద్యోగులను ఉత్సాహపరిచారు.