Boxing | అస్తానా(కజకిస్థాన్): ఏషియన్ యూత్ బాక్సింగ్ చాంపియన్షిప్లో భారత బాక్సర్లు దుమ్మురేపుతున్నారు. వేర్వేరు విభాగాల్లో ఫైనల్స్కు చేరి రికార్డు స్థాయిలో 43 పతకాలు ఖరారు చేశారు. పురుషుల అండర్-22 విభాగంలో ఆకాశ్ గోర్కా, విశ్వనాథ్ సురేశ్, నిఖిల్, ప్రీత్మాలిక్ తుది పోరులోకి దూసుకెళ్లారు. శనివారం జరిగిన 60కిలోల విభాగం సెమీస్ బౌట్లో సీనియర్ జాతీయ చాంపియన్ ఆకాశ్ 5-0తో ఇల్యాసోవ్ సయత్(ఉబ్బెకిస్థాన్)పై అద్భుత విజయం సాధించింది.
మిగతా బౌట్లలో విశ్వనాథ్(48కి), నిఖిల్(57కి), ప్రీత్మాలిక్(67కి) పసిడి పతకాలు కైవసం చేసుకున్నారు. జాదుమణిసింగ్(51కి), అజయ్కుమార్(63.5కి), అంకుశ్(71కి), ధృవ్సింగ్(80కి), జుగ్ను(86కి), యువరాజ్(92కి) కాంస్య పతకాలతో తమ పోరాటాన్ని ముగించారు. మరోవైపు మహిళల విభాగంలో నిశా, నికిత, లక్షయ్ రాతి, అన్ను ఆకాంక్ష తుది పోరులో నిలిచారు.