ISL | కోల్కతా: ఇండియన్ సూపర్ లీగ్(ఐఎస్ఎల్)లో ముంబై సిటీ ఎఫ్సీ టైటిల్ విజేతగా నిలిచింది. శనివారం ప్రఖ్యాత సాల్ట్లేక్ స్టేడియంలో జరిగిన ఫైనల్ మ్యాచ్లో ముంబై సిటీ 3-1తో మోహన్బగాన్ సూపర్జెయింట్పై అద్భుత విజయం సాధించింది. 62వేల మందితో కిక్కిరిసిన ప్రేక్షకుల మధ్య సాగిన పోరులో ముంబై తరఫున పెరీరా డియాజ్ (53ని), బిపిన్సింగ్(81ని), వోజస్(90+7సి) గోల్స్ చేశారు.
జాసన్ కమ్మింగ్స్ (44ని) మోహన్బగాన్కు ఏకైక గోల్ అందించాడు. 2020-21లో తొలిసారి టైటిల్ గెలిచిన ముంబైకి ఇది రెండోది. డిఫెండింగ్ చాంపియన్గా బరిలోకి దిగిన మోహన్బగాన్ టైటిల్ను తిరిగి నిలబెట్టుకునే అవకాశాన్ని చేజార్చుకుంది.