ఉస్మానియా యూనివర్సిటీ, మే 4: అసిస్టెంట్ ప్రొఫెసర్, లెక్చరర్ ఉద్యోగాలకు అర్హత సాధించేందుకు నిర్వహించే తెలంగాణ స్టేట్ ఎలిజిబిలిటీ టెస్ట్(టీఎస్ సెట్)-2024 నోటిఫికేషన్ విడుదలైంది. రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం, రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ లింబాద్రి శనివారం సెట్ కార్యాలయంలో నోటిఫికేషన్ విడుదల చేశారు.
ఈ సందర్భంగా టీఎస్ సెట్ మెంబర్, సెక్రటరీ ప్రొఫెసర్ నరేశ్రెడ్డి మాట్లాడుతూ.. ఆగస్టు 28నుంచి సెట్ పరీక్షలను నిర్వహించనున్నట్టు తెలిపారు. ఆన్లైన్లో ఈనెల 14నుంచి జూలై 2వరకు దరఖాస్తులను స్వీకరించనున్నట్టు పేర్కొన్నారు. అపరాధ రుసుముతో 26వరకు దరఖాస్తు చేసుకోవచ్చని చెప్పారు. హాల్టికెట్లను ఆగస్టు 20నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చని వివరించారు. పూర్తి వివరాలకు www.telanganaset.org, www.osmania.ac.in వెబ్సైట్లను చూసుకోవచ్చని సూచించారు.