NTR | ‘ఆర్ఆర్ఆర్’ తర్వాత తారక్ నిర్ణయాలు ఆసక్తికరంగా ఉంటున్నాయి. మారిన ఇమేజ్ని దృష్టిలో పెట్టుకొని జాగ్రత్తగా అడుగులేస్తున్నారాయన. ప్రస్తుతం ‘దేవర’ షూటింగ్లో తారక్ బిజీ. రెండు భాగాలుగా తెరకెక్కుతున్న ఆ చిత్రం తొలి భాగం అక్టోబర్లో విడుదల కానుంది. అలాగే బాలీవుడ్ ‘వార్2’లో కూడా తారక్ భాగమయ్యారు.
ఇందులో హృతిక్తో ఢీకొట్టనున్నారు. ఈ సినిమా వచ్చే ఏడాది రానుంది. ఈ రెండింటి తర్వాత ప్రశాంత్నీల్ సినిమా ఉంటుందన్న విషయం తెలిసిందే. ఆ సినిమా అప్డేట్పై ఇప్పుడు ఒక క్లారిటీ వచ్చింది. జూనియర్ ఎన్టీయార్ పుట్టినరోజైన మే 20న ఈ సినిమాకు సంబంధించిన అనౌన్స్మెంట్ రానుంది. అదే రోజున టైటిల్ని కూడా ప్రకటిస్తారని తెలుస్తున్నది. మైత్రీ మూవీమేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్న విషయం తెలిసిందే. కేజీఫ్ ఫ్రాంచైజీ, సలార్ చిత్రాలను మించే పవర్ఫుల్ సబ్జెక్ట్తో ప్రశాంత్నీల్ ఈ సినిమా తీయనున్నట్టు విశ్వసనీయ సమాచారం.