చీకట్లను దూరం చేసి వెలుగులు పంచే పౌర్ణమి కోసం అందరూ ఎదురుచూస్తుంటారు. ఆరుబయట కుర్చీ వేసుకొని నిండైన చందమామను ఎంతసేపు చూసినా తనివితీరదు. వెన్నెల వెలుగులు అలాంటివి మరీ. మనిషి మనసు దోసేసి, హాయినిచ్చే ఆ వెలుగులను మరింత వినూత్నంగా ఆస్వాదించాలంటే ఈ కింది ప్రదేశాలకు తప్పకుండా వెళ్లాల్సిందే. ప్రతి పున్నమికీ ప్రత్యేకత సంతరించుకునే ఆ ప్రదేశాలపై ఓ లుక్కేద్దాం రండి.
ఉదయ్పూర్: పౌర్ణమి రోజు రాజస్థాన్లోని ఉదయ్పూర్ సరస్సులు, రాజభవనాలు చంద్రకాంతిని ప్రతిబింబిస్తాయి. ఈ నగరమంతా బంగారు రంగులో మెరుస్తుంది. ఆ సమయం స్వర్ణయుగంగా అనిపిస్తుంది. నచ్చినవారితో వెళ్లి ఆస్వాదిస్తే ఆ అనుభూతే వేరు.
చంద్రతాల్: చంద్రతాల్ అంటే మూన్ లేక్ అని అర్థం. ఇది హిమాచల్ ప్రదేశ్లోని హిమాలయ శిఖరాల మధ్య ఉంటుంది. పౌర్ణమి రోజు ఎంతో అందంగా ధగధగ మెరుస్తూ చూసేవారికి ఆహ్లాదాన్ని కలిగిస్తుంది.
త్సో మోరిరి: లద్దాఖ్లోని ఎత్తైన ప్రదేశంలో త్సోమోరిరి ప్రవహిస్తూ ఉంటుంది. పౌర్ణమి రోజు ఈ నదీ జలాలు చంద్రుడు, నక్షత్రాల కాంతిని ప్రతిబింబిస్తూ మెరిసిపోతూ కనిపిస్తాయి. ప్రవాహం సాగినా వాటి కాంతి మాత్రం నిలకడగా ఉండి కనులకు కనువిందు చేస్తుంది.
కేరళం బ్యాక్ వాటర్స్: పౌర్ణమి రాత్రి కేరళం బ్యాక్ వాటర్స్లో హౌస్ బోట్ ప్రయాణం అద్బుతంగా ఉంటుంది. నీటిపై చంద్రుని ప్రతిబింబం మనసుకు ప్రశాంతమైన అనుభూతిని కలిగిస్తుంది.
తాజ్ మహల్: ఆగ్రాలో ఉన్న ఈ చారిత్రక కట్టడాన్ని తెల్లని పాలరాయితో నిర్మించారు. పౌర్ణమినాడు చంద్రుని వెలుగుతో మెరుస్తూ అక్కడికి వచ్చే ప్రేమికులను మురిపిస్తుంది. దాని అందం ఆ రోజు రెట్టింపు అవుతుంది.