Smriti Mandhana | బంగ్లాదేశ్తో జరుగుతున్న వన్డే సిరీస్లో పెద్దగా ఆకట్టుకోలేకపోయిన భారత మహిళా క్రికెటర్లు ఐసీసీ ర్యాంకింగ్స్లోనూ సత్తాచాటలేకపోయారు. వరుణుడి దోబూచులాటతో డక్వర్త్ లూయిస్ పద్ధతిలో బంగ్లాతో జరిగిన తొలి వన్డేలో భారత బ్యాటర్లంతా విఫలమైన విషయం తెలిసిందే. దీంతో టీమిండియా 40 పరుగుల తేడాతో బంగ్లా చేతిలో పరాజయం మూటగట్టుకుంది. వన్డే ఫార్మాట్లో బంగ్లాదేశ్ చేతిలో భారత జట్టుకు ఇదే తొలి ఓటమి కావడం గమనార్హం. దీంతో తాజాగా అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) విడుదల చేసిన ర్యాంకింగ్స్లో స్టార్ ఓపెనర్ స్మృతి మందన 6వ స్థానంలో నిలువగా.. కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ 8వ స్థానానికి పడిపోయింది. మందన ఖాతాలో 704 ర్యాంకింగ్ పాయింట్స్ ఉండగా.. హర్మన్ప్రీత్ 702 పాయింట్స్తో నిలిచింది. మంగళవారం 27వ పుట్టిన రోజు జరుపుకున్న స్మృతి గత ర్యాంకింగ్స్తో పోల్చుకుంటే ఒక స్థానాన్ని మెరుగు పర్చుకుంది. ఆస్ట్రేలియా ప్లేయర్ బెత్ మూనీ (769) అగ్రస్థానంలో నిలువగా.. నటాలియా స్కీవర్ (ఇంగ్లండ్; 763), చమరి ఆటపట్టు (శ్రీలంక; 734) వరుసగా ద్వితీయ, తృతీయ ర్యాంక్లు దక్కించుకున్నారు.
బౌలింగ్ విభాగంలో భారత్ నుంచి లెఫ్టార్మ్ స్పిన్నర్ రాజేశ్వరి గైక్వాడ్ మాత్రమే టాప్-10లో చోటు దక్కించుకుంది. గత ర్యాంకింగ్స్తో పోల్చుకుంటే ఒక స్థానం కోల్పోయిన రాజేశ్వరి ప్రస్తుతం 9వ ర్యాంక్లో ఉంటే.. ఆల్రౌండర్ల విభాగంలో దీప్తి శర్మ 7వ ప్లేస్లో నిలిచింది. బౌలింగ్ విభాగంలో ఇంగ్లండ్ పేసర్ సోఫియా ఎకెల్ట్న్ 756 పాయింట్లతో టాప్లో నిలిచింది. షబ్నమ్ ఇస్మాయిల్ (దక్షిణాఫ్రికా; 722), జెస్ జాన్సెన్ (ఆస్ట్రేలియా; 702) టాప్-3లో ఉన్నారు. ఆల్రౌండర్ల జాబితాలో ఇంగ్లండ్ ప్లేయర్ నటాలియా స్కీవర్ (402) అగ్రస్థానం దక్కించుకుంది.
SatwikSairaj | ఫార్ములా వన్ కార్ కంటే ఫాస్ట్గా స్మాష్.. గిన్నిస్ రికార్డుకెక్కిన సాత్విక్