Asian Games 2023 : భారత స్టార్ రెజ్లర్లు భజ్రంగ్ పూనియా(Bajrang Punia), వినేశ్ ఫోగట్ (vinesh phogat)లకు భారీ ఊరట. ట్రయల్స్ లేకుండానే ఆసియా గేమ్స్(Asian Games)లో పోటీపడేందుకు వీళ్లిద్దరికి అనుమతి లభించింది. అవును.. ఈ ఇద్దరికీ ట్రయల్స్ నుంచి మినహాయింపు ఇస్తూ భారత ఒలింపిక్ సమాఖ్య(IOC) అడ్ హక్ కమిటీ(ad-hoc panel ఈరోజు నిర్ణయం తీసుకుంది. జాతీయ కోచ్లను ఒక్క మాటైనా అడగకుండానే అడ్ హక్ కమిటీ ఈ ప్రకటన చేసింది. ఇంతకుముందు ఇదే కమిటీ భజ్రంగ్, వినేశ్ ఒక్క బౌట్లో పోటీ పడితే చాలు అని చెప్పిన విషయం తెలిసిందే. జూలై 22, 23వ తేదీల్లో ఆసియా కప్ ట్రయల్స్ నిర్వహించనున్నారు.
చైనాలోని హంగ్జో(Hangzhou) వేదికగా ఆసియా కప్ పోటీలు సెప్టెంబర్ – అక్టోబర్ మధ్య జరుగనున్నాయి. టోక్యో ఒలింపిక్స్(Tokyo Olympics)లో కాంస్యం నెగ్గన భజ్రంగ్, రెండుసార్లు వరల్డ్ చాంపియన్ వినేశ్కు ఈ టోర్నమెంట్లో మంచి రికార్డు ఉంది.
భజ్రంగ్ పూనియా, వినేశ్ ఫోగట్
జకర్తాలో 2018లో జరిగిన ఆసియా కప్(asia cup 2018) 65 కిలోల విభాగంలో భజ్రంగ్, 50 కిలోల విభాగంలో వినేశ్ బంగారు పతకాలు సాధించారు. ఈ టోర్నీలో గోల్డ్ మెడల్ గెలిచిన భారత రెజ్లర్లుగా వీళ్లు రికార్డు సృష్టించారు.
భారత రెజ్లింగ్ సమాఖ్య మాజీ అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్(Brij Bhushan)పై చర్యలు తీసుకోవాలని రెజ్లర్లు నెలల తరబడి ఆందోళనకు దిగిన విషయం తెలిసిందే. ఈ పోరాటానికి వినేశ్ ఫోగట్ నాయకత్వం వహించింది. ఆమెతో పాటు భజ్రంగ్ పూనియా, సాక్షి మాలిక్, సత్యవర్త కడియన్, సంగీత ఫోగట్, జితేంద్ర కన్హ ఉద్యమంలో పాల్గొన్నారు. ఆలోపే ఆసియా కప్ షెడ్యూల్ వచ్చింది. దాంతో, తమకు ఆసియా కప్ ట్రయల్స్లో పాల్గొనేందుకు ఆగస్టు 10 వరకు సమయం ఇవ్వాలని ఈ ఆరుగురు రెజ్లర్లు క్రీడా శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్కు లేఖ రాశారు. వాళ్ల అభ్యర్థనను పరిశీలించిన భారత ఒలింపిక్ సంఘం జూలై 15 వరకు మాత్రమే గడువు ఇచ్చింది.