Virender Sehwag : ఐపీఎల్ 17వ సీజన్లో మెరుపు ఇన్నింగ్స్లు ఆడుతున్న కుర్రాళ్లు టీ20 వరల్డ్ కప్(T20 Wolrd Cup 2024) జట్టులో స్థానంపై కన్నేశారు. వీళ్లలో ప్రతి మ్యాచ్లో సిక్సర్ల మోత మోగిస్తున్న శివం దూబే (Shivam Dube) అందరికంటే ముందువరుసలో ఉన్నాడు. పదిహేడో సీజన్లో విధ్వంసక ఇన్నింగ్స్లతో చెన్నై సూపర్ కింగ్స్ మ్యాచ్ విన్నర్గా అవతరించిన దూబేపై మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్(Virender Sehwag) ప్రశంసలు కురిపించాడు.
పొట్టి ప్రపంచకప్ జట్టులో దూబే ఉండడం ఖాయమని సెహ్వాగ్ వెల్లడించాడు. దూబే తన సంచలన బ్యాటింగ్తో స్టార్ ఆటగాళ్లు రిషభ్ పంత్, శ్రేయస్ అయ్యర్, సూర్యకుమార్ యాదవ్, కేఎల్ రాహుల్లకు గట్టి పోటీగా మారాడని వీరూ అన్నాడు.
‘ఐపీఎల్ 17వ సీజన్లో శివం దూబే అద్భుతంగా ఆడుతున్నాడు. పొట్టి ప్రపంచ కప్లో దూబేకు బెర్తు ఖాయం. గత రెండు సీజన్లుగా సీఎస్కే తరఫున నిలకడగా రాణిస్తున్న ఈ లెఫ్ట్హ్యాండర్ సీనియర్లపై ఒత్తిడి పెంచుతున్నాడు. దూబే జోరుతో పంత్, సూర్యకుమార్, రాహుల్, శ్రేయస్ల అవకాశాలు దెబ్బతింటున్నాయి అని సెహ్వాగ్ తెలిపాడు.
క్రీజులోకి రావడమే ఆలస్యం బంతిపై పగబట్టినట్టు బౌండ్రీలు బాదే దూబే 4 మ్యాచుల్లోనే 160.86 స్ట్రయిక్ రేటుతో 148 పరుగులు సాధించాడు. అతడి జోరు చూస్తుంటే ఈ ఏడాది ఆరెంజ్ క్యాప్ అందుకునేలా ఉన్నాడు. అజిత్ అగార్కర్ నేతృత్వంలోని సెలెక్షన్ కమిటీ జూన్లో స్క్వాడ్ను ప్రకటించనుంది.
Muscled not once but TWICE 💥💥
Shivam Dube on a roll in Hyderabad! 🔥
Watch the match LIVE on @JioCinema and @StarSportsIndia 💻📱#TATAIPL | #SRHvCSK | @IamShivamDube pic.twitter.com/0odsO9hgAv
— IndianPremierLeague (@IPL) April 5, 2024
ఈ ఏడాది జూన్లో టీ20 వరల్డ్ కప్ జరుగనుంది. అమెరికా, వెస్టిండీస్లు సంయుక్తంగా ఆతిథ్యమిస్తున్న ఈ టోర్నీ జూన్ 1న మొదల్వనుంది. ఈ మెగా టోర్నీలో జూన్ 9వ తేదీన చిరకాల ప్రత్యర్థులు భారత్, పాకిస్థాన్లు తలపడనున్నాయి. ఈ మ్యాచ్కు న్యూయార్క్ స్టేడియం వేదిక కానుంది.