Supreme Court | న్యాయమూర్తుల నియామకానికి సంబంధించిన కొలీజియం వ్యవస్థపై దాఖలైన పిటిషన్ను జాబితా చేసేందుకు సుప్రీంకోర్టు సోమవారం నిరాకరించింది. కొలీజియం వ్యవస్థను రద్దు చేయాలని కోరుతూ న్యాయవాది మాథ్యూస్ జే నెడుంపర దాఖలు చేసిన పిటిషన్ను కోర్టు పరిశీలించేందుకు నిరాకరించింది. కొలీజియం వ్యవస్థను రద్దు చేయాలంటూ తాను దాఖలు చేసిన రిట్ పిటిషన్ను విచారణకు లిస్ట్ చేయాలని న్యాయవాది మాథ్యూస్ కోర్టును కోరారు.
తాను చాలాసార్లు ఈ విషయంపై ప్రస్తావించానని.. రిజిస్ట్రీన పిటిషన్ను తిరస్కరించిందని.. విచారణకు జాబితా చేయలేదని కోర్టుకు తెలిపారు. చీఫ్ జస్జిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ జేబీ పార్దివాలా, జస్టిస్ మనోజ్ మిశ్రాలతో కూడిన ధర్మాసనం పిటిషన్ను విచారించింది. సీజేఐ స్పందిస్తూ.. ‘రాజ్యాంగ ధర్మాసనం ఏదైనా విషయంపై తీర్పు ఇచ్చిన తర్వాత ఆర్టికల్ 32 ప్రకారం పిటిషన్ విచారించడం సాధ్యం కాదని రిజిస్ట్రీ చెప్పారన్నారు. రిజిస్ట్రార్ ఆర్డర్కు వ్యతిరేకంగా ఇతర పరిష్కారాలు ఉన్నాయని.. అదే సమయంలో నేషనల్ జ్యుడీషియల్ అపాయింట్మెంట్స్ కమిషన్ (NJAC) నిర్ణయంపై రివ్యూ పిటిషన్ను ఛాంబర్లో తిరస్కరించినట్లు న్యాయవాది తెలిపారు.