Twins Marriage | కొట్టాయం : కేరళలోని కొట్టాయంలో జరిగిన ఆ వివాహానికి హాజరైనవారంతా తెగ ఆశ్చర్యపోయారు. దీనికి కారణ అది కవలల వివాహం కావడం.. పెండ్లి చేయించిన మత పెద్దలతో పాటు వారికి సహాయకులుగా వచ్చిన వారు కూడా కవలలే కావడం విశేషం. కొట్టాయంకు చెందిన కవల సోదరులు అఖిల్, నిఖిల్ మర్చంట్ నేవీ ఉద్యోగులు. వీరు మ్యాగీ, మారియా అనే కవల సోదరీమణులను వివాహమాడారు.
స్థానిక చంగనస్సేరి మెట్రోపాలిటన్ చర్చిలో జరిగిన వీరి వివాహాన్ని ఫాదర్ ఆంటో, ఫాదర్ అజో అనే కవల మత పెద్దలు జరిపించారు. వీరికి సాయంగా వచ్చిన ఇద్దరు కుర్రాళ్లు కూడా కవలలే. ఇంతమంది కవలలను ఒకే వేదికపై చూసిన అతిథులంతా తమను తామే నమ్మలేకపోయారు. కవల వధూవరులు మీడియాతో మాట్లాడుతూ తాము చిన్నప్పటి నుంచి కంటున్న కల నిజమైందన్నారు.