తిరుపతి : తిరుపతిలో కోదండరామస్వామివారి బ్రహ్మోత్సవాలు (Brahmotsavam) వైభవంగా కొనసాగుతున్నాయి. రెండో రోజు శనివారం రామచంద్రమూర్తి చిన్నశేష వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. గజరాజులు ముందు కదులుతుండగా, భక్తజన బృందాలు చెక్కభజనలు, కోలాటాలతో స్వామివారిని కీర్తిస్తూ స్వామివారి వాహనసేవ కోలాహలంగా జరిగింది.
అనంతరం కల్యాణ మండపంలో సీతా లక్ష్మణ సమేత కోదండరామస్వామి ( Kodandaramaswamy ) వారి ఉత్సవర్లకు శాస్త్రోక్తంగా స్నపన తిరుమంజనం నిర్వహించారు. వాహనసేవలో తిరుమల పెద్దజీయర్స్వామి, చిన్నజీయర్స్వామి, ఆలయ డిప్యూటీ ఈవో నాగరత్న, ఏఈవో పార్థసారధి, సూపరింటెండెంట్ సోమశేఖర్, కంకణభట్టర్ సీతారామాచార్యులు, టెంపుల్ ఇన్స్పెక్టర్లు చలపతి, సురేష్, భక్తులు పాల్గొన్నారు.