హైదరాబాద్, ఆగస్టు 7 (నమస్తే తెలంగాణ): టీపీసీసీ మీడియా అండ్ పబ్లిసిటీ విభాగం స్టేట్ చైర్మన్గా భువనగిరి లోక్సభ సభ్యుడు చామల కిరణ్కుమార్రెడ్డి నియమితులయ్యారు. కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఆమోదంతో చామల కిరణ్కుమార్రెడ్డిని ఈ పదవిలో నియమిస్తున్నట్టు ఏఐసీసీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ తెలిపారు. ఈ నియామకం తక్షణమే అమల్లోకి వస్తుందని ఏఐసీసీ స్పష్టంచేసింది. మీడియా, పార్టీకి మధ్య సమన్వయం సాధించడంలో కిరణ్కుమార్రెడ్డి కీలక పాత్ర పోషిస్తారని పార్టీ భావిస్తున్నది. అధిష్ఠానానికి, సీఎం, టీపీసీసీకి కిరణ్కుమార్రెడ్డి ధన్యవాదాలు తెలిపారు.