అమరావతి : ఏపీలో వైసీపీ (YCP) కి వరుస షాక్ల మీద షాకులు తగులుతున్నాయి. 24 గంటల వ్యవధిలో మరో ఎమ్మెల్యే కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. వైఎస్సార్ జిల్లాలో ప్రచారంలో ఉన్న ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల పూతలపట్టు నియోజకవర్గానికి చెందిన వైసీపీ ఎమ్మెల్యే(YCP MLA) ఎం.ఎస్ బాబు (Babu) కు కాంగ్రెస్ కండువాను కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. రాష్ట్రంలో కాంగ్రెస్(Congress) పార్టీ గెలుపునకు తనవంతు కృషి చేస్తానని ఎంఎస్ బాబు వెల్లడించారు. ఈసారి వైసీపీ ఆయనకు ఎమ్మెల్యేగా అవకాశం ఇవ్వక పోవడంతో మనస్తాపానికి గురై పార్టీ మారారు.
నిన్న హిందూపురం వైసీపీ( YCP) నాయకుడు, ఎమ్మెల్సీ మహ్మద్ ఇక్బాల్ (Mohammed Iqbal ) పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా సమర్పించారు. ఈ మేరకు సీఎం జగన్కు, మండలి చైర్మన్కు రాజీనామా లేఖను పంపించారు. 2019లో జరిగిన ఎన్నికల్లో మహ్మద్ ఇక్బాల్ హిందూపురం నుంచి నందమూరి బాలకృష్ణ (Balakrishna) పై పోటీ చేసి ఓడిపోయారు.