ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగురామన్న
అభివృద్ధి పనులకు భూమి పూజ
జైనథ్, జూలై 11 : గ్రామాల అభివృద్ధే ప్రభు త్వ ధ్యేయమని ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగురామన్న అన్నారు. మండలంలోని బెల్లారిలో సవారీ బంగ్లా షెడ్, సీసీ రోడ్డు నిర్మాణానికి ఆదివారం భూమి పూజ చేశారు. ఈసందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడారు. సీడీపీ నిధులతో ఈ అభివృద్ధి పను లు చేపడుతున్నట్లు తెలిపారు. దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమ పథకా లు అమలు చేస్తున్నట్లు వివరించారు. దళితబస్తీ, కల్యాణలక్ష్మి, ఆసరా పింఛన్లు, రైతుబంధు, రైతుబీమా తదితర పథకాలు ప్రతి ఇంటికీ అందుతున్నాయన్నారు. కార్యక్రమంలో రైతుబంధు సమితి జిల్లా అధ్యక్షుడు అడ్డి భోజారెడ్డి, ఏఎంసీ చైర్మన్ మెట్టు ప్రహ్లాద్, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు టీ వెంకట్రెడ్డి, రైతుబంధు సమితి మండల కన్వీనర్ ఎస్ లింగారెడ్డి, నాయకులు రాంరెడ్డి, విలాస్, పురుషోత్తం రెడ్డి, దత్తు పాల్గొన్నారు.
ఫొటోవర్క్షాప్ ప్రారంభం
ఎదులాపురం,జూలై11: జిల్లా కేంద్రంలోని తరంగిణి ఫంక్షన్ హాల్ జీఆర్ మెమోరియల్ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఫొటోవర్క్ షాపును ఎమ్మెల్యే జోగు రామన్న ఆదివారం ప్రారంభించారు. ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసి ఎంవీ గంగారాం చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడారు. మనం ఉన్నా, లేకున్నా ఫొటో మాత్రం కలకాలం ఉంటుందన్నారు. తాను ఎమ్మెల్యే అయినప్పటికీ ఒక్కోసారి కొన్ని కార్యక్రమాల్లో ఫొటోగ్రాఫర్లు చెప్పినట్లు వినాల్సిందేనని గుర్తుచేశారు. మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్ జన్మదినం సందర్భంగా జర్నలిస్ట్, వీడియోగ్రాఫర్లకు ప్రభుత్వ నుంచి రూ. 2లక్షల బీమా చేయించినట్లు గర్తుచేశారు. అనంతరం ఎమ్మెల్యేను శాలువాతోసత్కరించి మెమొం టో అందజేశారు. కార్యక్రమంలో సొసైటీ సభ్యులు పాల్గొన్నారు.
పరామర్శ
బేల,జూలై 11: మండలంలోని సాంగిడిలో బేల పీఏసీఎస్ చైర్మన్ బాల్చందర్ నానమ్మ పెద్దకర్మకు ఎమ్మెల్యే జోగురామన్న హాజరయ్యారు. ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రావుత్ మనోహర్, ఆదిలాబాద్ మార్కెట్ కమిటీ చైర్మన్ మెట్టు ప్రహ్లాద్, రైతు బంధు సమితి జిల్లా అధ్యక్షుడు అడ్డి భోజారెడ్డి, నాయకులు లింగారెడ్డి, గంభీర్ ఠాక్రే, ప్రమోద్ రెడ్డి, సతీశ్ పవర్, వట్టిపెళ్లి ఇంద్రశేఖర్, బాల్చందర్, గంగన్న, జక్కుల మధుకర్, కన్నల మహేందర్ పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి..
కొత్తగా పెళ్లయిన జంటను ఆషాఢంలో ఎందుకు ఒక్కచోట ఉండనీయరు?
జూలో అడవిపిల్లి కూనల సందడి.. వీడియో
రేపు భక్తులు లేకుండానే జగన్నాథ రథయాత్ర
ఈ మధ్యే పెండ్లయింది.. నా అనుమానం నిజమేనా?