భీంపూర్, ఏప్రిల్ 25 : ఓటు హక్కు అమూల్యమైనదని, దానిని తప్పకుండా వినియోగించుకోవాలని అసిస్టెంట్ రిటర్నిగ్ అధికారి, ఐటీడీఏ పీవో ఖుష్బూ గుప్తా అన్నారు. ఆమె గురువారం భీంపూర్ మండలంలోని జలకొరిలో కొత్తగా ఏర్పాటైన పోలింగ్ స్టేషన్ను సందర్శించారు. ఇంటింటికీ ఓటరు సమాచార స్లిప్పులను అందజేయాలని బీఎల్వోలను ఆదేశించారు. కరంజి(టి)లో బీఎల్వోలకు సూచనలు చేశారు. ప్రజలు స్వేచ్ఛగా ఓటుహక్కు వినియోగించుకోవాలన్నారు. పీవోతో తహసీల్దార్ నారాయణ, గిర్దావర్ శారద, బీఎల్వోలు ఉన్నారు.
మండలంలోని రాష్ట్ర సరిహద్దు కరంజి(టి) వద్ద గల అంతర్రాష్ట్ర చెక్పోస్టును గురువారం అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారి, ఐటీడీఏ పీవో ఖుష్బూ గుప్తా తనిఖీ చేశారు. సిబ్బందికి సూచనలు చేశారు. మహారాష్ట్ర నుంచి అక్రమంగా మద్యం, డబ్బు వంటివి తరలకుండా పగడ్బందీ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పీవోతో గిర్దావర్ శారద, తదితరులు ఉన్నారు.