ఆషాఢం వచ్చిందంటే కొత్తగా పెళ్లయిన జంటకు తంటే !! ఎందుకంటే ఆషాఢమాసంలో వారిని కలిసి ఉండనివ్వరు. కొత్తగా పెళ్లయిన అమ్మాయిని అత్తాగారింట్లో ఉండనివ్వకుండా పుట్టింటికి పంపించేస్తారు. మళ్లీ శ్రావణ మాసం వచ్చాకే తిరిగి అత్తారింటికి తీసుకొస్తారు. ఇలా ఆషాఢంలో భార్యాభర్తలను దూరంగా ఉంచడానికి పెద్ద కారణమే ఉంది? ఆషాఢంలో పెళ్లిళ్లు చేయకపోవడానికి కారణం కూడా అదే? ఆ కారణమేంటంటే..
ఆషాఢ మాసంలో వాతావరణంలో చాలా మార్పులు చోటు చేసుకుంటుంటాయి. వాతావరణం చల్లబడటం ద్వారా బ్యాక్టీరియా, వైరస్లు పెరిగి అంటువ్యాధులు ఎక్కువగా వస్తుంటాయి. ఇలాంటి సమయంలో కొత్త పెళ్లి కూతురు గర్భం దాలిస్తే పుట్టబోయే బిడ్డపై ఆ ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే పిండానికి తొలి మూడు నెలలు చాలా కీలకమైన సమయం. ఆ సమయంలోనే అవయవాలు ఏర్పడటం మొదలవుతుంది. ఇలాంటి సమయంలో తల్లి అంటువ్యాధుల బారిన పడితే కడుపులోని బిడ్డపై కూడా ఆ ప్రభావం పడుతుంది. అది కాకుండా ఆషాఢంలో గర్భం వస్తే.. మండు వేసవిలో కాన్పు ఉంటుంది. అంటే ఆ ఎండ తీవ్రతను తల్లీ బిడ్డ ఇద్దరూ తట్టుకోలేరు. దీంతో ఇద్దరికీ అనారోగ్య సమస్యలు వస్తాయి. అందుకే ఆషాఢంలో కొత్తగా పెళ్లయిన భార్యాభర్తలను దూరంగా ఉంచుతారు. అదీకాకుండా పెళ్లయిన కొత్తలో భార్యాభర్తల మధ్య విపరీతమైన ప్రేమ, ఆకర్షణ ఉంటాయి. అలాంటి సమయంలో నెల రోజుల పాటు దూరం ఉంటే.. ఎడబాటు వల్ల కలిగే బాధేంటో వారికి అర్థమవుతుంది. దీంతో వాళ్లు జీవితాంతం అన్యోన్యంగా ఉంటారని అలా చేస్తారు.
ఆషాఢంలో పూజలు, వ్రతాలు, రథయాత్రలు, పల్లకి సేవ వంటివి ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఆలయాలు భక్తులతో రద్దీగా ఉంటాయి. దీంతో పూజలతో పూజారులంతా బిజీగా ఉంటారు. దీంతో పెళ్లి తంతు నిర్వహించడానికి సమయం ఉండదు. అంతేకాకుండా ఆషాఢ మాసంలో సప్త ధాతువులు సరిగ్గా పనిచేయవు, వర్షాలు కురవడంతో పొలం పనులు కూడా అధికంగా ఉంటాయి.. అలాగే ఆషాఢంలో గర్భధారణకు అనువైన మాసం కాదని పురాణాలు పేర్కొంటున్నాయి. అందుకే ఆషాఢంలో పెళ్లిళ్లు చేయరు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఆషాఢంలో ఆడపిల్లలు గోరింటాకు ఎందుకు పెట్టుకోవాలి?
బోనాల పండుగకు ముస్తాబైన భాగ్యనగరం.. బోనం అంటే ఏంటి? ఈ ఉత్సవాలు ఎప్పుడు మొదలయ్యాయి?
హిందువుల్లో ఎక్కువ మంది ఏ దేవుడిని పూజిస్తారో తెలుసా?
ఆలయాల్లో పుష్పయాగం ఎందుకు నిర్వహిస్తారో…తెలుసా…?
ఏ రాశిలో పుట్టిన పిల్లల్లో ఎంత టాలెంట్ ఉంటుందో తెలుసా..!