తిరుపతి, జూన్ 17: ఆలయాల్లో పుష్పయాగం నిర్వహించడానికి చాలా కారణాలున్నాయి. బ్రహ్మోత్సవాల్లో గానీ, నిత్యకైంకర్యాల్లో గానీ అర్చక పరిచారకుల వల్ల కానీ, అధికార అనధికారుల వల్ల కానీ, భక్తుల వల్ల కానీ తెలిసీ తెలియక ఏవైనా లోపాలు జరిగి ఉంటే వాటికి ప్రాయశ్చిత్తంగా పుష్పయాగం నిర్వహిస్తుంటారు. అయితే కొన్నిఆలయాల్లో మాత్రమే పుష్పయాగం నిర్వహించే ఆనవాయితీ కొనసాగుతుంటుంది. పుష్ప యాగానికి ముందు స్నపనతిరుమంజనం నిర్వహిస్తారు. ఆతర్వాత పలురకాల పుష్పాలు, పత్రాలతో స్వామివారికి అభిషేకం చేస్తుంటారు. బ్రహ్మోత్సవాలు, నిత్యకైంకర్యాల్లో జరిగిన లోపాలకు ప్రాయశ్చిత్తంగా పుష్పయాగం నిర్వహిస్తారు.