IPL 2024 : ఐపీఎల్ 17వ సీజన్ మినీ వేలానికి బీసీసీఐ(BCCI), ఐపీఎల్ పాలక మండలి సిద్ధమవుతున్నాయి. ఫ్రాంచైజీలు కూడా వేలంలో దక్కించుకోవాల్సిన ఆటగాళ్ల మీద దృష్టిపెడుతున్నాయి. అయితే.. ఆటగాళ్లను అట్టపెట్టుకునేందుకు నవంబర్ 12 ఆఖరి తేదీ. దాంతో, అన్ని ఫ్రాంఐజీలు వదిలించుకున్న ఆటగాళ్ల పేర్లను వెల్లడిస్తున్నాయి. ఈ సమయంలో రాజస్థాన్ రాయల్స్(Rajasthan Royals)కు ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ జో రూట్(Joe Root)షాకింగ్ న్యూస్ చెప్పాడు. భారత్తో ఐదు టెస్టుల సిరీస్ మీద దృష్టిపెట్టిన రూట్ ఐపీఎల్ ఆడకూడదని నిర్ణయించుకున్నాడు. ఈ విషయాన్ని అతడు ఆదివారం ఫ్రాంచైజీకి తెలియజేశాడు.
🚨Joe Root has opted out of IPL 2024.
The dressing room will miss you, Rooty. 🫡💗
More on: https://t.co/VNdWoeFrkt pic.twitter.com/1u93iyyI2y
— Rajasthan Royals (@rajasthanroyals) November 25, 2023
‘ఆటగాళ్లను అట్టిపెట్టుకునే చర్చలు జరుగుతుండగా.. రూట్ ఐపీఎల్ 2024లో ఆడడం లేదని చెప్పాడు. తక్కువ సమయంలోనే రూట్ ఫ్రాంచైజీ, ఆటగాళ్ల మీద సానుకూల ప్రభావం చూపాడు. వచ్చే సీజన్లో అతడి అనుభవాన్ని మిస్ అవుతున్నాం. అతడి నిర్ణయాన్ని మేము స్వాగతిస్తున్నాం. అతడు అనుకున్న దాంట్లో విజయవంతం కావాలని కోరుకుంటున్నాం’ అని రాజస్థాన్ డైరెక్టర్ ఆఫ్ క్రికెట్ కుమార సంగక్కర(Kumar Sangakkara) ఓ ప్రకటనలో తెలిపాడు. టాపార్డర్ విఫలమైనప్పుడు మిడిలార్డర్లో రూట్లాంటి అనుభవజ్ఞుడు అవసరం. ఓవైపు వికెట్ కాపాడుతూనే.. స్ట్రయిక్ రొటేట్ చేసే రూట్ లేకపోవడం 17వ సీజన్లో రాజస్థాన్కు పెద్ద ఎదురుదెబ్బే అని విశ్లేషకులు అంటున్నారు.
రాజస్థాన్ రాయల్స్
2023 మినీ వేలంలో రూట్ను రాజస్థాన్ రూ.1 కోటి కనీస ధరకు కొనుగోలు చేసింది. 16వ సీజన్లో రూట్కు మూడు మ్యాచుల్లో ఆడాడంతే. ఒకే ఒక మ్యాచ్లో బ్యాటింగ్ చేసే అవకాశం రాగా.. 15 బంతుల్లో 10 పరుగులు చేశాడు. 2022 రన్నరప్ అయిన రాజస్థాన్ 16వ సీజన్ను ఘనంగా ఆరంభించినా ఆ తర్వాత తడబడింది. కెప్టెన్ సంజూ శాంసన్, జోస్ బట్లర్ కీలక మ్యాచుల్లో చేతులెత్తేయడం, బౌలింగ్ యూనిట్ స్థాయికి తగ్గ ప్రదర్శన కనబరచకపోవడంతో రాజస్థాన్ ప్లే ఆఫ్స్ చేరలేకపోయింది. బెన్ స్టోక్స్ సారథ్యంలోని ఇంగ్లండ్ వచ్చే ఏడాది జనవరిలో భారత పర్యటనకు రానుంది. ఇరుజట్లు ఐదు టెస్టుల సిరీస్లో తలపడనున్నాయి. ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ ఫైనల్ బెర్తుపై కన్నేసిన భారత్, ఇంగ్లండ్కు ఈ సిరీస్ కీలకం కానుంది.