నిజామాబాద్ : కాంగ్రెస్ పార్టీని నమ్ముకుని పార్టీలు మారకుండా ఉంటే టికెట్ రాలేదు. పార్టీలు మారి అధికారంలో ఉన్నప్పుడు వేల కోట్ల రూపాయలు అవినీతికి పాల్పడిన వ్యక్తులకే టికెట్లు ఇస్తున్నారని జుక్కల్ మాజీ ఎమ్మెల్యే గంగారాం(Former MLA Gangaram) అన్నారు. ఆదివారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ దళితుడైన తనకు సీట్ ఇవ్వకుండా మోసం చేసిందననారు. మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి ఇరిగేషన్ మంత్రిగా ఉన్నప్పుడు వెయ్యి కోట్లు అవినీతి చేస్తే టికెట్ ఇస్తారు, ఎలాంటి అవినీతి ఆరోపణలు లేని గంగారాంకు టికెట్ ఎందుకు ఇవ్వరని ప్రశ్నించారు. జుక్కల్ సెగ్మెంట్లో ఈ సారి గంగారాం అభిమానులు బీఆర్ఎస్(BRS) కారు గుర్తుకు ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు.