ఉమ్మడి జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో సీఎం కేసీఆర్ సమీక్ష
కరోనా కట్టడికి తీసుకుంటున్న చర్యలపై ఆరా
ప్రజారోగ్యానికే ప్రాధాన్యమని స్పష్టం
జిల్లాల్లో పరిస్థితిని వివరించిన ఉన్నతాధికారులు
లాక్డౌన్ మరింత కట్టుదిట్టం కానుంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా పరిధిలోని కలెక్టర్లు, ఎస్పీలతో సీఎం కేసీఆర్ శుక్రవారం వరంగల్ అర్బన్ కలెక్టరేట్ నుంచి సమీక్ష నిర్వహించారు. ప్రజా ఆరోగ్యానికే ప్రాధాన్యమని స్పష్టం చేశారు. కట్టడికి తీసుకుంటున్న చర్యలపై ఆరా తీయగా, జిల్లాల్లో పరిస్థితిని ఉన్నతాధికారులు వివరించారు. అలాగే పది రోజుల్లో ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియను పూర్తి చేయాలని ఆదేశించారు. – ఎదులాపురం/నిర్మల్ టౌన్, మే 21
ఎదులాపురం, మే 21 : లాక్డౌన్ మరింత కట్టుదిట్టం కానుంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా పరిధిలోని కలెక్టర్లు, ఎస్పీలతో సీఎం కేసీఆర్ శుక్రవారం వరంగల్ అర్బన్ కలెక్టరేట్ నుంచి సమీక్ష నిర్వహించారు. ప్రజా ఆరోగ్యానికే ప్రాధా న్యమని స్పష్టం చేశారు. కట్టడికి తీసుకుంటున్న చర్యలపై ఆయన ఆరా తీయగా, జిల్లాల్లో పరిస్థితి ని ఉన్నతాధికారులు ఆయనకు వివరించారు. ప్రజల ప్రాణాలకు రక్షణ కల్పించేందుకే లాక్డౌన్ నిర్ణయం తీసుకున్నామని సీఎం కేసీఆర్ పేర్కొ న్నారు. పోలీసు అధికారులు లాక్డౌన్ను కఠినం గా అమలు చేయాలని ఆదేశించారు. పాజిటివ్ కేసులు తగ్గుముఖం పట్టాయని, అనుమతి లేకుం డా రోడ్లపై తిరిగే వారిపై కఠినంగా వ్యవహరించాలన్నారు. అత్యవసర శాఖల సిబ్బంది విధులకు హాజరయ్యేలా పాస్లు జారీ చేయాలన్నారు. ప్రజలకు మెరుగైన వైద్యసేవలు అందించాలన్నారు. మందుల కొరత లేకుం డా చూసుకోవాలన్నారు. జిల్లా ఇన్చార్జి కలెక్టర్ రాహుల్ రాజ్ మాట్లాడుతూ జిల్లాలో పాజిటివ్ కేసులు తగ్గుముఖం పట్టాయని, దవాఖానల్లో ఆక్సిజన్ వినియోగం తగ్గిందని తెలిపారు. ఇన్చార్జి ఎస్పీ రాజేశ్ చంద్ర, అదనపు కలెక్టర్ ఎస్ నటరాజ్, ఎం డేవిడ్ ఆర్డీవో జాడి రాజేశ్వర్, జిల్లా వైద్యాఆరోగ్యశాఖ అధికారి నరేందర్, రిమ్స్ డైరెక్టర్ బలరాం నాయ క్, డీపీవో శ్రీనివాస్, డ్రాగ్ ఇన్స్పెక్టర్ శ్రీకాంత్, మున్సిపల్ ఆసిస్టెంట్ సీవీఎన్ రాజు పాల్గొన్నారు.