ఖానాపూర్ టౌన్, మే 8 : హిందువుల ఆరాధ్యదైవం సీతారాములపై సీఎం, కాంగ్రెస్ పార్టీ నాయకులు చేస్తున్న అనుచిత వ్యాఖ్యలను నిరసిస్తూ.. బుధవారం నిర్మల్ జిల్లా ఖానాపూర్ పట్టణంలోని తెలంగాణ చౌక్ వద్ద బజరంగ్దళ్ ఆధ్వర్యంలో రేవంత్రెడ్డి దిష్టిబొమ్మ ను దహనం చేశారు. ఈ సందర్భంగా బజరంగ్దళ్ నిర్మల్ జిల్లా అధ్యక్షుడు కాశవేణి ప్రణ య్ మాట్లాడుతూ.. ఈనెల 5వ తేదీన తుక్కుగూడలో నిర్వహించిన రోడ్ షోలు అయోధ్య నుంచి వచ్చిన అక్షింతలు కావవి, స్థానికంగానే రేషన్ బియ్యాన్నికి పసుపు పూసి ఇంటింటికీ పంచారని రేవంత్ర్రెడ్డి అవహేలన చేశారని మండిపడ్డారు. అయోధ్యలో కొలువుదీరిన బాలరామునిపై, అయోధ్య అక్షింతలపై మా ట్లాడడం సిగ్గు చేటన్నారు. రేవంత్రెడ్డి రాష్ట్రం లో రాజాకార్ల పాలన కొనసాగిస్తున్నారన్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. హిందువులపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే గాంధీభవన్ గడీలుబద్ధలు కొడుతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో శ్రీనివాస్, రాజశేఖర్, చంద్రశేఖర్ పాల్గొన్నారు.