మంచిర్యాల, మే 7(నమస్తే తెలంగాణ ప్రతినిధి) : కొత్త జిల్లాలను రద్దు చేస్తామంటూ వస్తున్న ప్రకటనలపై ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లావాసులు వ్యతిరేకిస్తున్నారు. ఉన్న జిల్లాలను రద్దు చేసి.. మళ్లీ పాత కష్టాలు తెస్తారా? అంటూ మండిపడుతున్నారు. ఉమ్మడి జిల్లా లో కొత్త జిల్లాలు ఏర్పాటు చేయాలనేది దశాబ్దాల కల. పాత జిల్లా ఉన్నప్పుడు మంచిర్యా ల, ఆసిఫాబాద్లను తూర్పు జిల్లా అని పిలుచుకునే వారు. ఆదిలాబాద్- నిర్మల్లను పశ్చి మ జిల్లాగా చెప్పేవారు. అప్పుడెప్పుడో ఎన్టీఆర్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో మంచిర్యాలను ప్రత్యేక జిల్లా చేస్తామంటూ ప్రకటించారు. కానీ.. దశాబ్దాలపాటు అది కేవలం నినాదంగానే మిగిలింది. ప్రభుత్వాలు మారినా జిల్లాల పునర్విభజన జరగలేదు. ఉద్యమ సమయంలో ఆదిలాబాద్ పర్యటన సందర్భంగా కొత్త జిల్లాలు ఏర్పాటు చేస్తామంటూ ప్రకటించిన కేసీఆర్.. స్వరాష్ట్రం సా ధించుకున్నాక జిల్లాల పునర్విభజనపై అద్భుతమైన నిర్ణయాన్ని తీసుకున్నారు. మందుచూపుతో మంచిర్యాలతోపాటు ఆసిఫాబాద్, నిర్మల్లను కొత్త జిల్లాలుగా ఏర్పాటు చేసి.. జిల్లావాసుల దశాబ్దాల కలను సాకారం చేశారు.
ఎన్నో సంస్కరణలకు బీజం
తెలంగాణలో 2016లో కొత్త జిల్లాలను ఏర్పా టు చేయడం ద్వారా పరిపాలన చేరువైంది. జి ల్లాలతోపాటు కొత్త మండలాలు, కొత్త మున్సిపాలిటీలు వచ్చాయి. అన్నింటికంటే మించి మారుమూల గోండు గూడేలు, తండాలు గ్రా మ పంచాయతీలుగా మారాయి. రూ.55 కోట్ల నుంచి రూ.60 కోట్లతో కొత్త కలెక్టరేట్ కార్యాలయాలు నిర్మితమయ్యాయి. ఎస్పీ కార్యాలయాలు, కమిషనరేట్లు, మెడికల్, నర్సింగ్ కాలేజీలు, రెవెన్యూ డివిజన్లు ఇలా ఎన్నో ఎనిమిదేళ్లలో జరిగాయి. కొత్త జిల్లాలు అభివృద్ధికి కే రాఫ్గా నిలిచాయి. అన్నింటికీ మించి ప్రభుత్వ సేవలు చేరువయ్యాయి. ప్రైవేటు పరిశ్రమలు, కంపెనీలు, బ్యాంకులు, రోడ్లు, రైలు మార్గాలు ఇలా అనేక హంగులు కొత్త జిల్లాలకు సమకూరాయి. జిల్లా కార్యాలయాలు అత్యంత సమపంలోకి వచ్చాయి. పరిధి చిన్నగా ఉండడంతో పాలనపై కలెక్టర్ల ప్రత్యక్ష పర్యవేక్షణ పెరిగింది. ప్రజాసమస్యల పరిష్కారంలో వేగం పెరిగింది. ఎస్పీ కార్యాలయాలు, కమిషనరేట్లు రావడంతో శాంతి భద్రతలు పెరిగాయి. నేరాలు నియంత్రణలోకి వచ్చాయి. జిల్లాలకు ప్రైవేటు పెట్టుబడిదారులు రావడంతో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు మెరుగుపడ్డాయి. చిన్న జిల్లాలు రాష్ర్టానికి ఆర్థిక వనరులుగా మారాయి.
ఇప్పుడు కుదిస్తే కష్టాలే..
కొత్త జిల్లాలను రద్దు చేసి పాత జిల్లాలను కొనసాగించినా.. పార్లమెంట్ నియోజకవర్గాలవారీగా జిల్లాలను ఏర్పాటు చేసినా ఇబ్బందులు తప్పవని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఉన్న ఫలంగా జిల్లాలను కుదిస్తే వచ్చే లాభాల కం టే, నష్టాలే ఎక్కువని చెప్తున్నారు. నిరుద్యోగు లు, ఉద్యోగులకు ఇబ్బందులు వస్తాయి. కొత్త జిల్లాలతో చాలా మందికి ప్రమోషన్లు వేగంగా వచ్చాయి. ఇప్పుడు రద్దు చేస్తే వారి పరిస్థితి ఎ లా ఉంటుందనేది చెప్పలేం. ఇక నిరుద్యోగులు ఉద్యోగాల కోసం మరో రెండు, మూడేళ్లు ఎదురుచూడాల్సి వస్తది. జిల్లాలను మారిస్తే జోన్ల విభజన కచ్చితంగా చేయాలి. నూతన జోనల్ వ్యవస్థను రూపొందించాలి. దానికి అసెంబ్లీ ఆమోదం తీసుకుని, రాష్ట్రపతి ఉత్తర్వుల కోసం పంపాలి. ఈ ప్రక్రియంతా పూర్తయ్యేసరికి యేండ్లు గడిచిపోతాయి. అప్పటి వరకు కొత్త నోటిఫికేషన్లు ఇవ్వడానికి వీలుండదు. ఫలితంగా నిరుద్యోగులు నష్టపోతారు.
పాత రోజులు తప్పవ్..
ఉమ్మడి జిల్లాలో కొత్త జిల్లాలను రద్దు చేస్తే మళ్లీ పాత రోజులు వస్తాయి. మంచిర్యాల, ఆసిఫాబాద్ నుంచి కలెక్టరేట్కు పోవాలంటే 100, 150 కిలోమీటర్లు పోవాలి. మారుమూల ప్రాంతాలైన బెజ్జూర్, సిర్పూర్, చింతలమానేపల్లి, కౌటాల, వేమనపల్లి, కోటపల్లి, నెన్నెల నుంచి ఆదిలాబాద్కు వెళ్లాలంటే ఒక్కరోజు పడుతుంది. ఇంట్లో సద్ది కట్టుకుని ఆదిలాబాద్ పోయేందుకు ఒక రోజు, అక్కడ పని చూసుకునేందుకు ఒక్క రోజు, అది పూర్తయ్యాక తిరిగి రావడానికి మరో రోజు మొత్తం మూడు రోజులు కేటాయించాలి. వ్యయ ప్రయాసలు పెరుగుతాయంటూ పాత రోజులను తలచుకుని జిల్లావాసులు భయపడిపోతున్నారు. కోరి కొరవితో తలగొక్కునట్లు ఏదో మార్పు కోసమని నమ్మి కాంగ్రెస్కు ఓటేస్తే ఇన్ని కష్టాలు పడాల్సి వస్తుందనుకోలేని వాపోతున్నారు. జిల్లాల జోలికొస్తే ఊరుకునేది లేదని స్పష్టం చేస్తున్నారు. ఉన్న జిల్లాలను రద్దు చేయాలని ఎవ్వరం కోరుకోవడం లేదని చెప్తున్నారు. ఇప్పటికైనా కాంగ్రెస్ సర్కార్ తన ప్రతిపాదనను వెనక్కి తీసుకోవాలని, లేకపోతే కొత్త జిల్లాల రద్దుకు వ్యతిరేకంగా పోరాటాలు చేయాల్సి వస్తుందని స్పష్టం చేస్తున్నారు.
కాంగ్రెస్ది మూర్ఖపు ఆలోచన
కొత్త జిల్లాల ఏర్పాటు కోసం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పటి నుంచి మంచిర్యాల ప్రజలు ఎదురు చూశారు. దశాబ్దాల కలను కేసీఆర్ సీఎం అయ్యాక నెరవేర్చారు. ఏర్పడిన జిల్లా ఇప్పుడు దశాబ్దకాలం కూడా ఉండేలా లేదు. రాజ్యాంగాన్ని రచించిన అంబేద్కర్ చిన్న జిల్లాలు ప్రగతికి సోపాలను అని చెప్పారు. అలాంటి రేవంత్రెడ్డి జిల్లాలు ఎందుకు రద్దు చేస్తున్నారో ఆయనకే స్పష్టత లేదు. ప్రజలకు సమాధానం చెప్పాల్సిన రోజు కచ్చితంగా ఒకటి వస్తది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఉన్నప్పుడు కలెక్టరేట్కు పోయి కష్టాలు చెప్పుకోవడం కంటే నష్టపోవడమే మేలు అనుకునేవాళ్లు చాలా మంది. జిల్లా కేంద్రానికి వెళ్లి రావాలంటే మూడు, నాలుగు రోజుల సమ యం పట్టేడి. అలాంటి పరిస్థితి నుంచి గంటలో కలెక్టర్ను కలుసుకునే రోజులు వచ్చాయి. కేసీఆర్ సర్కార్ చేసిన పనుల ఆనవాళ్లు లేకుండా చేయాలనేది కాంగ్రెస్ మూర్ఖపు ఆలోచన. దీంతో పట్టణాలు, నగరాలు మళ్లీ వెనకబడి పోతాయి. జిల్లాల రద్దు ఆలోచనను వెనక్కి తీసుకోవాలి. లేనిపక్షంలో పెద్ద ఎత్తున ఉద్యమిస్తాం. ప్రజలకు నష్టం చేసే ఏ పనినైనా నిలదీస్తాం. మా అధినేత ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపు మేరకు జిల్లాల రద్దుకు వ్యతిరేకంగా యుద్ధం చేయడానికి సిద్ధంగా ఉన్నాం.
– గోగుల రవీందర్రెడ్డి, బీఆర్ఎస్ రాష్ట్ర యువత ప్రధాన కార్యదర్శి
జిల్లాలు రద్దు చేస్తే నష్టాలివే..