Newzealand : స్వదేశంలో పాకిస్థాన్తో తొలి టీ20 మ్యాచ్కు ముందు న్యూజిలాండ్(Newzealand)కు పెద్ద షాక్ తగిలింది. స్టార్ ఆల్రౌండర్ మిచెల్ శాంట్నర్(Mitchell Santner) కరోనా(Carona) బారిన పడ్డాడు. గత రెండు రోజులుగా జలుబు, దగ్గు వంటి కోవిడ్ లక్షణాలతో బాధపడిన శాంట్నర్కు టెస్టు చేయగా పాజిటివ్ వచ్చింది. దాంతో అప్రమత్తమైన న్యూజిలాండ్ మేనేజ్మెంట్ అతడిని ఐసోలేషన్లో ఉంచింది.
జనవరి 14న హామిల్టన్(Hamilton)లో జరిగే రెండో మ్యాచ్కు శాంట్నర్ అందుబాటులో ఉంటాడా? లేదా? అనేది తెలియాల్సి ఉంది. ఒకవేళ కోలుకుంటే ఈ ఆల్రౌండర్ జట్టుతో కాకుండా హామిల్టన్కు విడిగా బయలేదేరనున్నాడు.
Mitchell Santner will miss the first T20I against Pakistan after testing positive for COVID
He has been in isolation at the team’s Auckland hotel after the test. He will continue to be monitored and will travel solo for the next T20I in Hamilton. #NZvPAK pic.twitter.com/ozRwhFClbC
— ESPNcricinfo (@ESPNcricinfo) January 12, 2024
పొట్టి ప్రపంచ కప్ సన్నాహకాల్లో భాగంగా న్యూజిలాండ్, పాకిస్థాన్లు ఐదు టీ20ల సిరీస్లో తలపడనున్నాయి. జనవరి 12న ఆక్లాండ్లో జరిగే తొలి పోరుకు ఇరుజట్లు సిద్ధమయ్యాయి. ఈ సిరీస్లో పాకిస్థాన్ జట్టకు స్పీడ్స్టర్ షాహీన్ ఆఫ్రిది కెప్టెన్గా, ఓపెనర్ మహ్మద్ రిజ్వాన్ వైస్ కెప్టెన్గా వ్యవహరించనున్నారు.
విలియమ్సన్
మరోవైపు కివీస్ కేన్ విలియమ్సన్ సారథ్యలో బరిలోకి దిగనుంది. ఇరుజట్ల మధ్య జనవరి 14న హామిల్టన్లో రెండో టీ20, 17వ తేదీన ఓవల్లో మూడో టీ20, హెగ్లే ఓవల్లో 19న నాలుగో టీ20, జనవరి 21న హెగ్గే ఓవల్లో ఆఖరి టీ20 జరుగనుంది.