గాంధీనగర్, జనవరి 11: దేశవ్యాప్తంగా ఎలక్ట్రిక్ వాహనాలకు పెరుగుతున్న గిరాకీని దృష్టిలో పెట్టుకొని కార్ల తయారీలో అగ్రగామి సంస్థయైన మారుతి సుజుకీ ఈ మాడల్ను విడుదల చేయడానికి సిద్ధమైంది. ఈ ఏడాది చివరినాటికి తన తొలి ఎలక్ట్రిక్ వాహనాన్ని విడుదల చేయబోతున్నట్లు కంపెనీ వర్గాలు సూచనప్రాయంగా చెప్పాయి.
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనే రూ.750 కోట్ల లిథియం-అయాన్ బ్యాటరీ సెల్స్, మాడ్యుల్స్ను ఇతర దేశాలకు ఎగుమతి చేయాలనుకుంటున్నట్లు మారుతి సుజుకీ ఈడీ రాహుల్ భారతి తెలిపారు. ఈ ఏడాదిలోనే దేశీయ మార్కెట్లోకి ఈవీని విడుదల చేయడంతోపాటు యూరప్, జపాన్ దేశాలకు ఎగుమతి చేసే ఆలోచన కూడా సంస్థకు ఉన్నదన్నారు. గుజరాత్లో తోషిబా కార్పొరేషన్, డెన్సో కార్పొరేషన్, సుజుకీ మోటర్ కార్పొరేషన్లు కలిసి లిథియం-అయాన్ బ్యాటరీ ప్లాంట్ను ఏర్పాటు చేస్తున్నాయి.