కరీమాబాద్/వర్ధన్నపేట/ఐనవోలు/ గిర్మాజీ పేట/కాశీబుగ్గ/గీసుగొండ/ధర్మసాగర్, మే 5 : పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థుల గెలుపు కోరుతూ పార్టీ శ్రేణులు విస్తృత ప్రచారం నిర్వహిస్తున్నారు. ఇందులో ఆదివారం వరంగల్ 32వ డివిజన్లో పల్లం పద్మ ఆధ్వర్యంలో నాయకులు ఇంటింటా ప్రచారం నిర్వహించారు. బీఆర్ఎస్ వరంగల్ ఎంపీ అభ్యర్థి మారెపల్లి సుధీర్కుమార్ను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ పల్లం రవి, బీఆర్ఎస్ డివిజన్ అధ్యక్షుడు పొగాకు సందీప్, నాయకులు పరదేశి రాజేశ్, మాటేటి శ్యామ్, దస్తగిరి పాల్గొన్నారు. అలాగే, వర్ధన్నపేట మండలంలో ఎంపీపీ అన్నమనేని అప్పారావు ఆధ్వర్యంలో ఇంటింటా ప్రచారం నిర్వహించారు. మాజీ ఎంపీపీ నూనె భిక్షపతి ఆధ్వర్యంలో ఉపాధి కూలీలను ఓట్లు అభ్యర్థించారు. అంతేకాకుండా ఇల్లంద, కట్య్రాల, ఉప్పరపల్లి, నల్లబెల్లి, బండౌతాపురంలో ప్రచారం చేశారు. బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు తూళ్ల కుమారస్వామి పాల్గొన్నారు. అలాగే, ఐనవోలు మండలంలోని ఐనవోలు, పున్నేల్, పంథిని, పెరుమాండ్లగూడెం, నర్సింహులగూడెం, రాంనగర్, వనమాలకనపర్తి, నంద నం, కొండపర్తి, ముల్కలగూడెంలో బీఆర్ఎస్ నాయకులు ఇంటింటా ప్రచారం చేశారు. జడ్పీ కోఆప్షన్ ఉస్మాన్ అలీ, సొసైటీ వైస్ చైర్మన్ చందర్రావు, ఎంపీటీసీ సోమేశ్వర్రావు, మాజీ సర్పంచ్లు స్వామి, కొమురయ్య, సదానందం, నాయకులు అశోక్, కుమార్, ఎల్లగౌడ్, అశోక్, దేవదా సు, సుదర్శన్, కుమార్, రాజు, చందర్, రాజు, రమేశ్, పుష్ప, లక్ష్మీ, బాబు పాల్గొన్నారు.
వరంగల్ 29వ డివిజన్ అధ్యక్షుడు కొడకండ్ల సదాంత్ ఆధ్వర్యంలో జరిగిన ప్రచార కార్యక్రమంలో బూస శేఖర్, ప్రసాద్, దిలీప్, శ్రీకాంత్, రవి, ఆర్ రమేశ్, రామకృష్ణ, పూజారి సారంగం, బత్తుల వెంకటేశ్వర్లు, భీమరాజు, మైదం కరుణాకర్, జావిద్, రాజ్కుమార్ పాల్గొన్నారు. అలాగే, 33వ డివిజన్ పెరుకవాడలో మహిళా నేత మణె క్క ఆధ్వర్యంలో ప్రచారం చేశారు. సుధీర్కుమార్ గెలుపు కోసం వరంగల్ 14వ డివిజన్లో పార్టీ ఎస్ఆర్నగర్ అధ్యక్షుడు పసులాది మల్లయ్య, కేతిరి రాజశేఖర్ బొడ్రాయి, హనుమాన్ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఇంటింటా ప్రచారం చేశారు. కేతిరి సమ్మక్క, అంబాల సత్యం, హైమావతి, నేరెళ్ల సరోజన, చీకటి రవీందర్, పసునూరి సరిత, కన్నం విమల, కొంక వినాకర్, పిట్టల సంజీవ, అందే మదు, ఆరెల్లి రజిత, రాధిక, గౌసియా, అంబాల పద్మ, పద్మ పాల్గొన్నారు. గీసుగొండ మండలం మొగిలిచెర్ల, ధర్మారం, జాన్పాక, కీర్తినగర్ గ్రామాల్లో జరిగిన ప్రచారంలో కార్పొరేటర్లు సుంకరి మనీషా, ఆకుల మనోహర్, డీసీసీబీ డైరెక్టర్ దొంగల రమేశ్, నాయకులు గోలి రాజయ్య, గజ్జి రాజు, ఉజ్వల్, శ్రవణ్, నాగరాజు, రాజు పాల్గొన్నారు. అలాగే, ధర్మసాగర్ మండలంలోని నారాయణగిరి, మల్లక్పల్లె, ధర్మసాగర్, శాయిపేట గ్రామాల్లో బీఆర్ఎస్ నాయకులు కారు గుర్తుకు ఓటు వేయాలని ప్రజలను అభ్యర్థించారు. మండలాధ్యక్షుడు మునిగెల రాజు, నాయకులు కర్ర సోమిరెడ్డి, బొడ్డు ప్రభుదాస్, చాడ కుమార్, లాల్, బాలు, కొమురయ్య, రమేశ్యాదవ్, ప్రతాప్, జుబేదా, రాజమణి, లక్ష్మి, విప్లవ్, వినేశ్ పాల్గొన్నారు.