Telangana | హైదరాబాద్: రాష్ట్రస్థాయి 7వ యూత్ మెన్ అండ్ ఉమెన్ బాక్సింగ్ చాంపియన్షిప్లో తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యూకేషనల్ ఇనిస్టిట్యూషన్స్ (టీఎస్డబ్ల్యూఆర్ఈఐఎస్) విద్యార్థులు అదరగొట్టారు. హైదరాబాద్లోని లాలగూడ వేదికగా ఆదివారం జరిగిన పోటీలలోని వేర్వేరు విభాగాలలో గురుకుల పాఠశాలలకు చెందిన నలుగురు బాక్సర్లు స్వర్ణ పతకాలు నెగ్గారు. శ్రీలేఖ (48-50 కిలోలు), నిఖిత (45-48 కిలోలు), అశ్విక్ (75-80 కిలోలు), విష్ణువర్ధన్ (60-65 కిలోలు) పసిడి పతకాలు గెలిచినవారిలో ఉన్నారు.