Ranji Trophy 2024 : రంజీ సెమీఫైనల్లో ముంబై(Mumbai), మధ్యప్రదేశ్(Madhya Pradesh) జట్లు జోరు కొనసాగిస్తున్నాయి. తొలి రోజు ముంబై పేసర్ శార్దూల్ ఠాకూర్(Shardhul Thakur) విజృంభించడంతో తమిళనాడు 146 పరుగులకే కుప్పకూలింది. రెండో సెమీస్లో మధ్య ప్రదేశ్ బౌలర్ అవేశ్ ఖాన్(Avesh Khan) నిప్పులు చెరిగాడు. అతడు నాలుగు వికెట్లు తీయడంతో విదర్భ జట్టు 170 పరుగులకే చాప చుట్టేసింది. కరుణ్ నాయర్(63) హాఫ్ సెంచరీతో పోరాడాడు. అనంతరం ఇన్నింగ్స్ ఆరంభించిన మధ్యప్రదేశ్ ఆట ముగిసే సరికి ఒక వికెట్ నష్టానికి 47 పరుగులు చేసింది.
ముంబైకి శార్ధూల్ శుభారంభమిచ్చాడు. తొలి ఓవర్లోనే సాయి సుదర్శన్ను ఔట్ చేశాడు. ఆ తర్వాత తుషార్ దేశ్పాండే తమిళనాడు భరతం పట్టాడు. కెప్టెన్ సాయి కిశోర్ను ఔట్ చేయడంతో 10.1 ఓవర్లలో తమిళనాడు 17 రన్స్కే నాలుగు వికెట్లు కోల్పోయింది. కష్టాల్లో పడ్డ జట్టును బాబా ఇంద్రజిత్, విజయ్ శంకర్లు ఆదుకునే ప్రయత్నం చేశారు.
Madhya Pradesh reach 47/1, trail by 123 runs at stumps on Day 1!
The visitors bowled Vidarbha out for 170 in the first innings as 11 wickets fell on an intriguing opening day.@IDFCFIRSTBank | #VIDvMP | #RanjiTrophy | #SF1
Scorecard ▶️ https://t.co/2Yp4Orqs34 pic.twitter.com/RolPWO91S0
— BCCI Domestic (@BCCIdomestic) March 2, 2024
కానీ, దేశ్పాండే ఈ జోడీని విడదీసి ముంబైకి బ్రేక్ ఇచ్చాడు. ఆ తర్వాత బ్యాటింగ్కు దిగిన ముంబైకి ఆదిలోనే షాక్ తగిలింది. రంజీల్లో గొప్ప రికార్డున్న ఓపెనర్ పృథ్వీ షా(5), భూపేన్ లల్వానీ(15)లు స్వల్ప స్కోర్కే వెనుదిరిగారు. అయితే.. ముషీర్ ఖాన్(24 నాటౌట్), మోహిత్ అవస్థి(1)లు ఆచితూచి ఆడారు. దాంతో, ముంబై ఆటముగిసే సరికి రెండు వికెట్ల నష్టానికి 45 పరుగులు చేసింది.