అమరావతి : దేశవ్యాప్తంగా బీజేపీ ప్రకటించిన అభ్యర్థుల తొలి జాబితాలో ఏపీకి స్థానం దక్కలేదు. మొదటి జాబితాలో సుమారు 195 మంది బీజేపీ అభ్యర్థుల (BJP Candidate List) పేర్లను ప్రకటించగా అందులో ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) లో అభ్యర్థుల పేర్లను వెల్లడించలేదు. ఏపీలో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుండడంతో టీడీపీ, జనసేన కూటమి(Alliance) పార్టీలు బీజేపీతో పొత్తును ఆశిస్తున్నాయి.
ఏపీలో ఒంటరిగా పోటీ చేయాలా, పొత్తులతో ముందుకు వెళ్లాలా అనే అంశంపై అధిష్టానం చేస్తున్న కసరత్తు ఇంకా కొలిక్కి రాకపోవడంతోనే అభ్యర్థులను ఖరారు చేయక ఉండకపోవచ్చని ఏపీ బీజేపీ నాయకులు భావిస్తున్నారు. 2019లో జరిగిన ఎన్నికల్లో ఏపీలో ఉన్న 25 స్థానాలకు గాను వైసీపీ 22 స్థానాలు, టీడీపీ మూడు స్థానాలు గెలుచుకున్నాయి. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ఒక్క స్థానాన్ని కూడా దక్కించుకోలేక పోయాయి. రాబోయే ఎన్నికల్లో 370 స్థానాలను కైవసం చేసుకుంటామని దీమాను వ్యక్తం చేస్తున్న బీజేపీ ఏపీలోనూ బోణి కొట్టాలన్న లక్ష్యంతో ముందుకు వెళ్తుంది.