Heart Attack | జగిత్యాల జిల్లాలో విషాదం నెలకొంది. కోరుట్ల పోలీస్ స్టేషన్లో ఏఎస్సైగా విధులు నిర్వహిస్తున్న లోకిని రాజేందర్ (53) గుండెపోటుతో మరణించాడు.
కుటుంబసభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. శుక్రవారం సాయంత్రం విధులు పూర్తి చేసుకుని రాజేందర్ ఇంటికి వెళ్లాడు. రాత్రి 11 గంటల సమయంలో ఛాతి నొప్పి రావడంతో స్థానికంగా ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అక్కడే చికిత్స పొందుతున్న రాజేందర్.. పరిస్థితి విషమించడంతో శనివారం తెల్లవారుజామున మృతి చెందారు.
లోకిని రాజేందర్ కానిస్టేబుల్గా పోలీసు వృత్తిలోకి వచ్చారు. నిబద్ధతతో పనిచేసిన ఆయన.. అంచెలంచెలుగా ప్రమోషన్లు అందుకుంటూ ఏఎస్సై స్థాయికి చేరుకున్నారు. రాజేందర్ మృతి పట్ల మెట్పల్లి డీఎస్పీ ఉమా మహేశ్వరరావు, ఎస్సై కిరణ్, పోలీస్ సిబ్బంది దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన మృత దేహానికి నివాళులర్పించారు.