IND vs RSA : సిరీస్ డిసైడర్ అయిన మూడో వన్డేలో భారత టాపార్డర్(Top Order) విఫలమైంది. ఓపెనర్లు రజత్ పటిదార్(22 : 16 బంతుల్లో 3 ఫోర్లు, ఒక సిక్సర్), సాయి సుదర్శన్(10 : 16 బంతుల్లో ఒక ఫోర్) తక్కువ స్కోర్కే వెనుదిరిగారు. దాంతో, టీమిండియా 10 ఓవర్లకు 2 వికెట్ల నష్టానికి 59 పరుగులు చేసింది. ప్రస్తుతం సంజూ శాంసన్(11), కెప్టెన్ కేఎల్ రాహుల్(6) మరో వికెట్ పడకుండా జాగ్రత్తంగా ఆడుతున్నారు.
బోలాండ్ పార్క్లో జరుగుతున్న మూడో వన్డేలో టాస్ గెలిచిన సఫారీ కెప్టెన్ మర్క్రమ్ బౌలింగ్ తీసుకున్నాడు. ఈ మ్యాచ్తో వన్డేల్లో అరంగ్రేటం చేసిన రజత్ పటిదార్(22) దూకుడుగా ఇన్నింగ్స్ ఆరంభించాడు. మరో ఎండ్లో సుదర్శన్ కూడా కాన్ఫిడెంట్గా కనిపించాడు.
This shot’s already becoming a bit of a Sai Sudharshan signature 4⃣
Tune in to the 3rd #SAvIND ODI LIVE NOW | @StarSportsIndia pic.twitter.com/5xzBbGyrp3
— ESPNcricinfo (@ESPNcricinfo) December 21, 2023
కానీ, బర్గర్ ఓవర్లో సిక్సర్ బాదిన పాటిదార్ మరో భారీ షాట్ ఆడబోయి బౌల్డయ్యాడు. ఆ కేసటికే హెండ్రిక్స్ ఫామ్లో ఉన్న సుదర్శన్ను ఎల్బీగా వెనక్కి పంపాడు. దాంతో, 49 పరుగులకే రెండు కీలక వికెట్లు కోల్పోయిన జట్టును రాహుల్, శాంసన్ ఆదుకునే ప్రయత్నం చేస్తున్నారు.