Jagadish Reddy | రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ బలంగానే ఉందని.. పార్లమెంట్ ఎన్నికల్లో పార్టీ రెండంకెల సీట్లు రావడం ఖాయమని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్రెడ్డి అన్నారు. గురువారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఇప్పటికీ బీఆర్ఎస్ పార్టీకి మాత్రమే బలం ఉందన్నారు. బీఆర్ఎస్ అభ్యర్థులు బలమైన వారు అయినందునే కాంగ్రెస్, బీజేపీ పోటీపడి బీఆర్ఎస్ నాయకులను ఆయా పార్టీల్లో చేరుకొని బరిలోకి దింపాయని విమర్శించారు. ఆ రెండు పార్టీలు పోటీ పడేది ముమ్మాటికీ బీఆర్ఎస్తోనేనని జగదీశ్రెడ్డి అన్నారు. ఈ ఎన్నికల్లో అంచనాలకు మించి బీఆర్ఎస్ పార్టీ విజయాలను నమోదు చేసుకుంటుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.