ములుగురూరల్, డిసెంబర్21: ములుగు(Mulugu) జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ దివంగత కుసుమ జగదీశ్వర్(Kusuma Jagdeeswar) సోదరుడు కుసుమ జయప్రకాశ్(50) గుండెపోటు(Heart attack,)తో మృతి చెందాడు. మల్లంపల్లి గ్రామానికి చెందిన ఆయన హైదరాబాద్లో నివాసముంటున్నాడు. బుధవారం సాయంత్రం గుండెపోటుకు గురికాగా కుటుంబ సభ్యులు దవాఖానకు తరలించి చికిత్స అందిస్తుండగా మృతి చెందాడు.
ఆయన మృతదేహాన్ని స్వగ్రామమైన మల్లంపల్లికి తరలించి గురువారం అంత్యక్రియలు నిర్వహించారు. కాగా, ములుగు జడ్పీ చైర్మన్గా కొనసాగుతున్న క్రమంలో కుసుమ జగదీశ్వర్ జూన్లో గుండెపోటుతో మృతి చెందాడు. ఆరు నెలలు గడువకముందే జగదీశ్వర్ ఏకైక తమ్ముడు జయప్రకాశ్ సైతం గుండెపోటుతో మృత్యువాతపడడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. దీంతో వారి తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు గుండెలవిసేలా రోదించారు.