PBKS vs RCB : ధర్మశాలలో జరుగుతున్న చావోరేవో పోరులో ఆర్సీబీకి భారీ షాక్ తగిలింది. అరంగేట్ర పేసర్ విధ్వత్ కవెరప్ప విజృంభణతో రెండు వికెట్లు కోల్పోయింది. మూడో ఓవర్లోనే కెప్టెన్ ఫాఫ్ డూప్లెసిస్(9)ను ఔట్ చేసిన కవెరప్ప.. తర్వాతి ఓవర్లో డేంజరస్ విల్ జాక్స్(12)ను వెనక్కి పంపాడు. దాంతో, 43 పరుగులకే బెంగళూరు రెండు వికెట్లు పడ్డాయి. ప్రస్తుతం విరాట్ కోహ్లీ(22), రజత్ పాటిదార్(1)లు ఆడుతున్నారు. 5 ఓవర్లకు బెంగళూరు స్కోర్.. 44/2.