PBKS vs RCB : ధర్మశాలలో పంజాబ్ కింగ్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మధ్య జరుగుతున్న మ్యాచ్కు వర్షం అంతరాయం కలిగించింది. 10 వ ఓవర్ ముగిసే సరికి వాన మొదలైంది. దాంతో, అంపైర్లు మ్యాచ్ను నిలిపివేశారు. సామ్ కరన్ వేసిన ఆఖరి బంతికి రజత్ పాటిదార్(55) ఔటయ్యాడు. విరాట్ కోహ్లీ(42), కామెరూన్ గ్రీన్(0)లు ఆడతున్నారు. 10 ఓవర్లకు ఆర్సీబీ స్కోర్… 119/3.
చావోరేవో పోరులో ఆర్సీబీకి భారీ షాక్ తగిలింది. అరంగేట్ర పేసర్ విధ్వత్ కవెరప్ప విజృంభణతో రెండు వికెట్లు కోల్పోయింది. మూడో ఓవర్లోనే కెప్టెన్ ఫాఫ్ డూప్లెసిస్(9)ను ఔట్ చేసిన కవెరప్ప.. తర్వాతి ఓవర్లో డేంజరస్ విల్ జాక్స్(12)ను వెనక్కి పంపాడు. దాంతో, 43 పరుగులకే బెంగళూరు రెండు వికెట్లు పడ్డాయి. ఆ తర్వాత వచ్చిన రజత్ పాటిదార్(55) పంజాబ్ బౌలర్లను చితక్కొట్టాడు. 23 బంతుల్లోనే అర్ధ సెంచరీతో జట్టు స్కోర్ను పరుగులు పెట్టించాడు. ధాటిగా ఆడుతున్న అతడు బెయర్స్టోకు దొరికాడు. దాంతో, 119 పరుగుల వద్ద ఆర్సీబీ మూడో వికెట్ పడింది.