అహ్మదాబాద్ : గుజరాత్లోని సూరత్లో వందే భారత్ ఎక్స్ప్రెస్ (Vande Bharat Inspired Restaurant) థీమ్తో ఏర్పాటు చేసిన రెస్టారెంట్ కస్టమర్లను ఆకట్టుకుంటోంది. మంచి యాంబియెన్స్తో నోరూరించే ఆహారం అందించే రెస్టారెంట్లకు ఆదరణ ఉంటూనే ఉంటుందని ఈ రెస్టారెంట్ మరోసారి చాటిచెప్పింది.
వేగానికి, ఆధునిక సౌకర్యాలకు పేరొందిన వందే భారత్ ట్రైన్కు తగ్గట్టుగానే సూరత్లో ఏర్పాటైన ఈ వందే భారత్ థీమ్డ్ రెస్టారెంట్లో ఎన్నో డిష్లను వేగంగా సర్వ్ చేస్తూ ఆకట్టుకుంటున్నారు. చటోరా అంకిత్ అనే యూజర్ ఇన్స్టాగ్రాంలో ఈ రెస్టారెంట్ విశేషాలను పంచుకున్నారు.
ఈ రెస్టారెంట్లో రెండు రకాల సూప్స్, ఏడు రకాల చాట్స్, పది రకాల కోల్డ్ సలాడ్, రెండు రకాల గార్లిక్ బ్రెడ్, మూడు రకాల పిజాతో పాటు సౌతిండియన్, పంజాబీ ఫుడ్, అపరిమిత కూల్ డ్రింక్స్, ఎంచుకున్న ఓ డెజర్ట్ను ఆఫర్ చేస్తున్నారు. లంచ్ మెనూ సగటు ధర రూ. 268 కాగా, డిన్నర్ సగటు ధర రూ. 289గా నిర్ణయించారు. అందుబాటు ధరలను ఆఫర్ చేస్తున్న ఈ రెస్టారెంట్ భోజన ప్రియులను ఆకట్టుకుంటోంది.
Read More :