సంగారెడ్డి : అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయనందున రాహుల్ గాంధీ (Rahul Gandhi) తెలంగాణ ప్రజలకు క్షమాపణ (Apologize ) చెప్పాలని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్రావు (Harish Rao) డిమాండ్ చేశారు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ పట్టణంలో బీఆర్ఎస్ అభ్యర్థి గాలి అనిల్కుమార్కు మద్దతుగా నిర్వహించిన రోడ్ షోలో (Road Show) ఆయన పాల్గొని మాట్లాడారు.
మహిళలకు కాంగ్రెస్ రూ. 2,500 ఇచ్చిందని రాహుల్ గాంధీ వాస్తవాలు తెలుసుకోకుండా మాట్లాడుతున్నారని ఆరోపించారు. రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన హామీలు వంద కాదు రెండువందల రోజులైనా హామీలు అమలు కాలేదని మండిపడ్డారు. ఢిల్లీలో తెలంగాణ హక్కులు కాపాడాలంటే ప్రశ్నించే గొంతుక గాలి అనిల్ కుమార్ ను గెలిపించాలని కోరారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో జహీరాబాద్ పట్టణానికి రూ. 150 కోట్లను మంజూరు చేసి అన్ని వర్గాలను అభివృద్ధి పథంలో తీసుకువెళ్లామని గుర్తు చేశారు.
కేసీఆర్(KCR) ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రైతులకు 24 గంటల కరెంట్ ఇవ్వగా కాంగ్రెస్ వచ్చాక కరెంటు కోతలు మొదలయ్యాయని పేర్కొన్నారు. రైతులను మోసం చేస్తున్న రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ నాయకులు ఏ ముఖం పెట్టుకొని ఓట్లు అడుగుతున్నారని ప్రశ్నించారు. బీఆర్ఎస్ హాయంలో మైనార్టీలకు మంత్రి పదవులు ఇచ్చారని, ప్రస్తుతం ఒక్క మైనార్టీ మంత్రి వర్గంలో లేరని విమర్శించారు.