న్యూఢిల్లీ : (Neeraj Chopra) ఒలింపిక్ ఛాంపియన్ నీరజ్ చోప్రాను ఐపీఎల్ ఫ్రాంచైజీ చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్కే) ఆదివారం ఘనంగా సత్కరించింది. ఒలింపిక్లో బంగారు పతకం సాధించగానే కోటి రూపాయల బహుమతి ఇవ్వనున్నట్లు ప్రకటించింది. నాలుగు సార్లు ఐపీఎల్ ఛాంపియన్గా నిలిచిన సీఎస్కే.. నీరజ్కు రూ.కోటి బహుమతితో పాటు ప్రత్యేక జెర్సీని అందజేసింది. ఒలింపిక్స్ పురుషుల జావెలిన్లో బంగారు పతకాన్ని గెలుచుకున్న దూరాన్ని సూచించే 8758 నంబర్తో ప్రత్యేక జెర్సీని బహూకరించారు. న్యూఢిల్లీలో సీఈఓ కాశీ విశ్వనాథన్ నుంచి నీరజ్ చోప్రా ఈ ప్రత్యేక జెర్సీని అందుకున్నారు. స్పెషల్ జెర్సీతో నీరజ్తో కాశీ విశ్వనాథన్ ఉన్న ఫొటోను చెన్నై సూపర్ కింగ్స్ ఆదివారం తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో షేర్ చేసింది.
క్యాష్ రివార్డ్, ప్రత్యేక జెర్సీని అందుకున్న తర్వాత నీరజ్ చోప్రా మాట్లాడారు. సీఎస్కే మద్దతు, రివార్డ్కు ధన్యవాదాలు తెలిపారు. గత 2 నెలలుగా క్రీడాభిమానుల నుంచి ఇంతటి ప్రేమను అందుకుంటానని తాను ఊహించలేదని చెప్పాడు. కష్టపడి పని చేసిన వారెవరైనా మంచి ఫలితాలు సాధిస్తారు అనే దానికి నేనే నిర్వచనం’ అని నీరజ్ చెప్పారు. 87.58 అనేది భారతీయ క్రీడా చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయే సంఖ్య అని, ఈ ప్రత్యేక జెర్సీని నీరజ్కి అందించడం మాకు గర్వకారణంగా ఉన్నదని సీఎస్కే సీఈఓ కాశీ విశ్వనాథన్ అన్నారు. ఆయన దేశానికి మరింత కీర్తిప్రతిష్ఠలను తీసుకురావాలని కోరుకుంటున్నామని పేర్కొన్నారు.
త్వరలో భారత్ నుంచి ఎలోన్ మస్క్ సంస్థకు సరికొత్త సవాల్
శీతాకాలంలో గుండెపోటును ఇలా నివారించండి
తొలిసారి ప్రపంచం ముందుకొచ్చిన తాలిబాన్ అగ్రనేత అఖుంద్జాదా
వెంకన్నను దర్శించుకున్న అనిల్ అంబానీ దంపతులు
ఏపీ డిప్యూటీ సీఎంకు ఊహించని షాక్
ఊరికో గ్రంథాలయం, ఇంటికో స్వచ్ఛాలయం నినాదం కావాలి : వెంకయ్యనాయుడు
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..