చేర్యాల : టీఆర్ఎస్ పార్టీని మరింత బలోపేతం చేసేందుకు నూతనంగా నియమితులైన మండల, గ్రామ కమిటీల ప్రతినిధులతోపాటు అనుబంధ సంఘాల సభ్యులు సైనికుల్లా కృషి చేయాలని జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి పిలుపునిచ్చారు. గురువారం జనగామ జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే కార్యాలయంలో చేర్యాల, కొమురవెల్లి, మద్దూరు, ధూళిమిట్ట, చేర్యాల టౌన్ కమిటీలతో పాటు అనుబంధ సంఘాల కార్యవర్గాలను ఎమ్మెల్యే ముత్తిరెడ్డి టీఆర్ఎస్ నియోజకవర్గ కో-ఆర్డినేటర్ గుజ్జ సంపత్రెడ్డితో కలిసి ప్రకటించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కమిటీల ప్రతినిధులు క్రమశిక్షణతో మండల, జిల్లా, రాష్ట్ర పార్టీల పిలుపు మేరకు పని చేయాలన్నారు.
మండల అధ్యక్షులు వీరే..
చేర్యాల మండల అధ్యక్షుడిగా కడవేర్గుకు చెందిన అనంతుల మల్లేశం, చేర్యాల టౌన్ అధ్యక్షుడిగా ముస్త్యాల నాగేశ్వర్రావు, కొమురవెల్లి మండల అధ్యక్షుడిగా కొమురవెల్లి మండల కేంద్రానికి చెందిన గీస భిక్షపతి, మద్దూరు మండల అధ్యక్షుడిగా గాగిళ్లాపూర్కు చెందిన మేక సంతోష్, ధూళిమిట్ట మండల అధ్యక్షుడిగా కొండాపురం గ్రామానికి చెందిన మంద యాదగిరిని నియమించినట్లు ఎమ్మెల్యే తెలిపారు. ఆయా కార్యక్రమాల్లో ఎంపీపీలు బద్దిపడిగె కృష్ణారెడ్డి, వుల్లంపల్లి కరుణాకర్, తలారీ కీర్తనాకిషన్, జడ్పీటీసీలు శెట్టె మల్లేశం, సిలువేరు సిద్ధప్ప, మార్కెట్ కమిటీ చైర్మన్ సుంకరి మల్లేశం, వైస్ చైర్మన్ పుర్మ వెంకట్రెడ్డి, పీఏసీఎస్ చైర్మన్లు వంగ చంద్రారెడ్డి, నాగిల్లి తిరుపతిరెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్ నిమ్మ రాజీవ్రెడ్డి, నాయకులు ముస్త్యాల బాల్నర్సయ్య, కౌన్సిలర్లు, మార్కెట్ డైరెక్టర్లు, ముఖ్య నాయకులు పాల్గొన్నారు.