T20 World Cup 2024 : టీమిండియా మాజీ ఆల్రౌండర్ యువరాజ్ సింగ్(Yuvarj Sigh)కు అరుదైన గౌరవం దక్కింది. ఈ ఏడాది జూన్లో జరుగబోయే పొట్టి ప్రపంచ కప్(T20 World Cup 2024 )టోర్నీకి యూవీ అంబాసిడర్గా ఎంపికయ్యాడు. ఈ మోగా టోర్నీకి ముందు అమెరికాలో నిర్వహించే పలు ప్రమోషన్ ఈవెంట్లలో యువరాజ్ పాల్గొననున్నాడు. పొట్టి ప్రపంచకప్ ప్రచారకర్తగా ఎంపికవ్వడం పట్ల ఈ మాజీ క్రికెటర్ సంతోషం వ్యక్తం చేశాడు. టీ20 వరల్డ్ కప్లోనే తాను అద్భుతమైన జ్ఞాపకాలు పోగుచేసుకున్నానని యువీ తెలిపాడు.
‘పొట్టి ప్రపంచ కప్తోనే నా క్రికెట్ జర్నీలో మర్చిపోలేని జ్ఞాపకాలు సొంతం చేసుకున్నా. ఒకే ఓవర్లో ఆరు సిక్సర్లు కొట్టడం అందులో ఒకటి. అందుకనే అంబాసిడర్గా కొత్త పాత్ర పోషించేందుకు ఉత్సాహంగా ఎదురుచూస్తున్నా. క్రికెట్ ఆడేందుకు వెస్టిండీస్(West Indies) నిజంగా ఒక గొప్ప ప్రదేశం. ఇక అమెరికాలోనూ క్రికెట్ విస్తరిస్తోంది. న్యూయార్క్లో జూన్ 9న జరిగే భారత్, పాకిస్థాన్ మ్యాచ్ ప్రపంచంలోనే గొప్ప పోరాటం కానుంది. ప్రచార కర్తగా గొప్ప ఆటగాళ్లను కలుసుకోవడాన్ని గౌరవంగా భావిస్తున్నా’ అని యవరాజ్ సింగ్ వెల్లడించాడు. అంబాసిడర్గా ఎంపికైకన యూవీ.. క్రికెట్ లెజెండ్ క్రిస్ గేల్(Chris Gayle), జమైకా చిరుతు ఉసేన్ బోల్ట్(Usain Bolt)లతో కలిసి పలు వేదికల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలువనున్నాడు.
భారత జట్టు గొప్ప ఆల్రౌండర్లలో ఒకడైన యువరాజ్.. ఐసీసీ తొలిసారిగా 2007లో నిర్వహించిన పొట్టి వరల్డ్ కప్(T20 World Cup 2007)లో ఓ రేంజ్లో ఆడాడు. ఇక నాకౌట్ పోరుకు ముందు ఇంగ్లండ్పై అయితే తన వీరత్వం చూపించాడు. ఆండ్రూ ఫ్లింటాఫ్ రెచ్చగొట్టడంతో ఏకంగా ఆరు సిక్సర్ల రికార్డు నెలకొల్పాడు.
స్టువార్ట్ బ్రాడ్ బౌలింగ్లో వరుసగా ఆరు బంతుల్ని స్టాండ్స్లోకి పంపిన ఈ లెఫ్ట్ హ్యాండర్ చరిత్ర సృష్టించాడు. ఆ తర్వాత 2011లో సొంతగడ్డపై జరిగిన వన్డే ప్రపంచ కప్లోనూ యూవీ అదరగొట్టాడు. బ్యాటుతో, బంతితో రాణించి టీమిండియాను ఫైనల్ చేరడంలో కీలక పాత్ర పోషించాడు. కొన్ని రోజులు క్యాన్సర్తో పోరాడిన యువీ 2019 జూన్ 10వ తేదీన ఆటకు వీడ్కోలు పలికాడు.