ములుగు, అక్టోబర్ 17 : మద్యం మత్తులో నీటి కుంటలోపడి వృద్ధురాలి మృతిచెందిన ఘటన ఆర్అండ్ఆర్ కాలనీలో ఆదివారం చోటుచేసుకుంది. ఎస్సై రంగ కృష్ణ తెలిపిన వివరాల ప్రకారం..భైలంపూర్ గ్రామానికి చెందిన పల్లె ఎల్లమ్మ (50) కూరగాయలు విక్రయిస్తూ జీవనం సాగిస్తున్నది.
ఎల్లమ్మ శుక్రవారం రాత్రి మద్యం సేవించి బంధువులను కలిసి వస్తానని వెళ్లి ఇంటికి తిరిగిరాలేదు. కాగా, ఆదివారం ఉదయం గ్రామంలోని ఓ నీటి కుంటలో ఎల్లమ్మ మృతదేహం ప్రత్యక్షమైంది. మద్యం మత్తులో నీటి కుంటలో ప్రమాదవశాత్తుపడి మృతిచెందినట్లు కుటుంబీకులు తెలిపారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. మృతురాలికి భర్త, కొడుకు, కూతురు ఉన్నారు.