సిద్దిపేట కలెక్టరేట్, జూన్ 19 : పలు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవానికి సీఎం కేసీఆర్ నేడు సిద్దిపేట కు రానున్న నేపథ్యంలో పోలీస్ శాఖ భారీ బందోబస్తును ఏర్పాటు చేసింది. సీపీ జోయల్ డెవిస్ శనివా రం పోలీస్ సిబ్బందికి దిశానిర్దేశం చేశారు. సీఎం పర్యటించే ప్రాంతా ల్లో ఎలాంటి అవాంచనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా బందోబస్తును 15 సెక్టార్లుగా విభజించారు. సీపీ జోయల్ డెవిస్తోపాటు సూర్యాపేట ఎస్పీ భాస్కరన్, వికారాబాద్ ఎస్పీ నారాయణ బందోబస్తును పర్యవేక్షిస్తారు. రెవెన్యూ, ఇతర శాఖల అధికారులకు తెలుపు, మీడియా ప్రతినిధులకు లైట్ నీలపు రంగు లో, ప్రజాప్రతినిధులకు గ్రీన్ కలర్ పాస్లు జారీచేశారు. పాస్లు ఉన్న వారిని మాత్రమే అనుమతిస్తారు.